తెలంగాణ

telangana

By

Published : Jun 1, 2019, 10:00 AM IST

ETV Bharat / international

రంగురంగుల దుంపల రుచే వేరు....

పెరూ దేశ రాజధాని లీమాలో బంగాళ దుంప పదో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో రైతులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. వందల రకాల ఆలుగడ్డలు, ప్రత్యేక వంటకాలు ఆకట్టుకున్నాయి.

పెరూలో బంగాల దుంప పండుగ

బంగాళ దుంప పండుగ పదో వార్షికోత్సవం

పెరూలో బంగాళ దుంప పదో వార్షికోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. రైతులు, వ్యాపారులూ పాల్గొన్నారు.

తెలుపు, పసుపు, గులాబీ, ఊదారంగు బంగాళ దుంపలు చూపరులను ఆకట్టుకున్నాయి.

ఆలుగడ్డల సాగుకు పెరూ ప్రసిద్ధి. అక్కడి రైతులు దాదాపు 3,500 రకాల బంగాళ దుంపలను సాగు చేస్తారు. 30 లక్షల మంది రైతులకు ఇదే ప్రధాన ఆదాయ వనరు. ఎక్కువగా ఆలూతో చేసిన వంటకాలనే తింటారు పెరూ ప్రజలు.

పెరూలో 2018లో ఆలుగడ్డ ఉత్పత్తి 5.1 మిలియన్ టన్నులకు చేరింది. ఇందులో 90 శాతం ఆ దేశంలోనే అమ్ముడవుతుంది.

ABOUT THE AUTHOR

...view details