తెలంగాణ

telangana

ETV Bharat / international

డ్రగ్​ పునరావాస కేంద్రంపై దాడి- 24 మంది మృతి

మెక్సికోలోని ఓ డ్రగ్​ రిహాబిలిటేషన్​ కేంద్రంలో దుండగులు తుపాకులతో విరుచుకుపడ్డారు. అందులో ఉన్న అందరిపై విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. 24 మంది మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి.

By

Published : Jul 2, 2020, 8:28 AM IST

MEXICO-DRUG REHAB-GUNMEN
మెక్సికో

మెక్సికోలో కొంతమంది దుండగులు మారణహోమం సృష్టించారు. గువానాహువాటో రాష్ట్రం ఇరాపూవాటోలోని ఓ డ్రగ్ రిహాబిలిటేషన్ కేంద్రంలో జరిగిన కాల్పుల్లో 24 మంది మరణించారు. ఏడుగురు గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

రిహాబిలిటేషన్ కేంద్రంలోని అందరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కేంద్రంలోని దృశ్యాలు రక్తసిక్తమైన యుద్ధభూమిని తలపిస్తోందని ఓ అధికారి అన్నారు.

ఈ ఘటన వెనుక కారణాలు తెలియరాలేదని, స్థానిక డ్రగ్​ సరఫరాదారుల ముఠాకు సంబంధం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details