తెలంగాణ

telangana

By

Published : Sep 23, 2021, 5:03 AM IST

Updated : Sep 23, 2021, 6:08 AM IST

ETV Bharat / international

Modi US visit: మోదీ అమెరికా పర్యటన సాగనుందిలా..

అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ(Modi Us Visit 2021) తీరిక లేకుండా గడపనున్నారు. క్వాడ్ శిఖరాగ్ర సదస్సు, ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించడం సహా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​లతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వివిధ సంస్థల సీఈఓలతోనూ ఆయన భేటీ కానున్నారు. అమెరికాలో మోదీ (modi us visit 2021) షెడ్యూల్​ ఎలా ఉందంటే..?

PM Modi US Visit 2021
మోదీ అమెరికా పర్యటన

నాలుగు రోజుల పర్యటనలో(Modi Us Visit 2021) భాగంగా అమెరికాకు వెళ్లినభారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ బిజీబిజీగా గడపనున్నారు. తొలిసారి నేరుగా నిర్వహిస్తున్న క్వాడ్​ సదస్సులో పాల్గొననున్నారు. క్వాడ్​ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలపై సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి 76 వార్షిక సదస్సులో ప్రసంగించనున్నారు. మోదీ పర్యటన(Modi Us Visit 2021) ఎలా సాగనుందంటే..

(భారత కాలమానం ప్రకారం- గంటల్లో)

గురువారం(సెప్టెంబర్​ 23)

  • రాత్రి 7:15- క్వాల్​కామ్​ సీఈఓ క్రిస్టియానో ఆర్ అమోన్​తో మోదీ భేటీ.
  • రాత్రి 7:35- అడోబ్​ ఛైర్మన్​ శంతను నారాయణ్​తో మోదీ సమావేశం.
  • రాత్రి 7:55- ఫస్ట్​ సోలార్ సంస్థ సీఈఓ మార్క్ విడ్​మర్​తో మోదీ భేటీ.
  • రాత్రి 8:35- బ్లాక్​స్టోన్​ సీఈఓ స్టీఫెన్ ఏ స్క్వార్జ్​మన్​​తో మోదీ భేటీ
  • రాత్రి 11:00- ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ ​మారిసన్​తో మోదీ ద్వైపాక్షిక సమావేశం.

శుక్రవారం(సెప్టెంబర్​ 24)

  • ఉదయం 12:45- అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్​తో మోదీ ద్వైపాక్షిక సమావేశం జరగనుంది.
  • ఉదయం 3:00- జపాన్ ప్రధాని యొషిహిదే సుగాతో మోదీ భేటీ కానున్నారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు.
  • రాత్రి 8:30- పర్యటనలో అత్యంత కీలక ఘట్టమైన.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం వైట్​హౌస్​లో జరగనుంది. వీరి భేటీ గంటసేపు కొనసాగనుంది.
  • రాత్రి 11:30- లంచ్ విరామం తర్వాత, ప్రధాని మోదీ వైట్​హౌస్​కు చేరుకుంటారు. అక్కడ జపాన్​, అమెరికా, ఆస్ట్రేలియాలతో నిర్వహించే క్వాడ్​ శిఖరాగ్ర సమావేశంలో(Quad Summit 2021) మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమం రెండు గంటలపాటు కొనసాగనుంది.

శనివారం(సెప్టెంబర్​ 25)

  • రాత్రి 7:30- ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మోదీ ప్రసంగిస్తారు.
  • రాత్రి 9:15- అమెరికా నుంచి దిల్లీకి మోదీ బయలుదేరుతారు.

ఆదివారం( సెప్టెంబర్​ 26)

  • ఉదయం 11:30- మోదీ దిల్లీకి చేరుకుంటారు.

అమెరికా పర్యటనకు(Modi Us Visit 2021) ముందు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఈ పర్యటనలో భారత్​- అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో సమీక్షించనున్నట్లు తెలిపారు. పరస్పర ప్రయోజనం ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చించనున్నట్లు మోదీ(Modi Us Visit) వెల్లడించారు. అలాగే ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో(Modi UNGA) ఉగ్రవాదంపై పోరు, వాతవారణ మార్పులు సహా పలు అంశాలపై ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.

"అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యొషిహిదె సుగాలతో కలిసి తొలిసారి ప్రత్యక్షంగా జరగనున్న క్వాడ్​ సమ్మిట్‌లో పాల్గొంటాను. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని భవిష్యత్​ కార్యచరణ ప్రాధాన్యతలను గుర్తించడానికి ఈ సదస్సు అవకాశాన్ని అందిస్తుంది. అమెరికా పర్యటన సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం, క్వాడ్​ దేశాలతో సంబంధాల బలోపేతానికి, ముఖ్యమైన అంతర్జాతీయ సమస్యలపై సహకారాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది."

- ప్రధాని నరేంద్ర మోదీ

ఇవీ చూడండి:

Last Updated : Sep 23, 2021, 6:08 AM IST

ABOUT THE AUTHOR

...view details