తెలంగాణ

telangana

By

Published : Sep 22, 2019, 10:43 AM IST

Updated : Oct 1, 2019, 1:31 PM IST

ETV Bharat / international

ప్రధాని హోదాను మరచి మోదీ ఏం చేశారో చూడండి...

పరిశుభ్రత విషయంలో తాను చెప్పే విషయాలను స్వయంగా ఆచరిస్తానని తెలియచెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. హ్యూస్టన్​లోని జార్జ్​ బుష్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకు స్వాగతం పలికే సమయంలో పుష్ప గుచ్ఛం నుంచి కింద పడిన పూలను స్వయంగా తీసి ఇచ్చి పరిశుభ్రత ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.

ప్రధాని హోదాను మరచి మోదీ ఏం చేశారో చూడండి...

ప్రధాని హోదాను మరచి మోదీ ఏం చేశారో చూడండి...

పరిశుభ్రత ప్రాముఖ్యాన్ని మరోమారు చాటి చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలోనే కాదు విదేశాల్లోనూ పరిశుభ్రత కోసం తాను ఎప్పుడూ పాటుపడతానని.. తాను చెప్పే వాటిని ఆచరిస్తానని ప్రపంచానికి తెలియజేశారు మోదీ. హ్యూస్టన్​లోని జార్జ్​ బుష్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన చిన్న సంఘటన అందుకు నిదర్శనంగా నిలిచింది.

'హౌడీ మోదీ' కార్యక్రమం కోసం హ్యూస్టన్​ వెళ్లిన మోదీ... జార్జ్​ బుష్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా అమెరికా ప్రతినిధులు, భారత్​లోని అమెరికా రాయబారి కెన్నెత్​ జస్టర్​, అమెరికాలో భారత రాయబారి హర్ష వర్ధన్​ ష్రింగ్లా, ఇతర నేతలు ప్రధాని స్వాగతం పలికారు.

మోదీకి పుష్ప గుచ్ఛాన్ని అందించారు అమెరికా ప్రతినిధి ఒకరు. ఆ సందర్భంగా అందులోంచి కొన్ని పూలు కిందపడిపోయాయి. అందరిని ఆశ్చర్యపరుస్తూ ప్రధాని మోదీ కిందికి వంగి స్వయంగా ఆ పూలను తీసి సిబ్బందికి అందించారు. ఈ చర్యతో పరిశుభ్రతపై తనకు ఉన్న చిత్తశుద్ధిని ప్రపంచానికి చాటి చెప్పారు.

తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వచ్ఛ భారత్​ మిషన్​ ప్రారంభించారు మోదీ. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమంపై ప్రశంసలు వచ్చాయి.

స్వచ్ఛ భారత్​ మిషన్​కుగాను బిల్ అండ్ ​మిలిందా గేట్స్​ స్వచ్ఛంద సంస్థ మోదీకి గ్లోబల్​ కోల్​కీపర్​ అవార్డును ప్రకటించింది.

ఇదీ చూడండి:సిక్కులు, కశ్మీరీ పండితులతో మోదీ భేటీ

Last Updated : Oct 1, 2019, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details