తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉక్రెయిన్ అంశంలో ట్రంప్ గీత దాటారు: పెలోసీ - Nancy Pelosi, the House Speaker and top Democrat

రాజ్యాంగ నిబంధనలను మీరిన కారణంగానే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనను ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ. ఉక్రెయిన్​తో వ్యవహారంలో ట్రంప్ గీత దాటినట్లు పేర్కొన్నారు.

trump
ఉక్రెయిన్ అంశంలో ట్రంప్ గీత దాటారు: పెలోసీ

By

Published : Jan 12, 2020, 11:55 PM IST

ట్రంప్ అభిశంసనపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల సభ స్పీకర్, డెమొక్రాట్ పార్టీకి చెందిన నాన్సీ పెలోసీ. ఉక్రెయిన్​ వ్యవహారంలో ట్రంప్ గీత దాటారని పేర్కొన్నారు.

డెమొక్రాట్​ సభ్యులు మెజారిటీగా ఉన్న ప్రతినిధుల సభలో గత నెలలోనే ట్రంప్​పై అభిశంసన తీర్మానం నెగ్గింది. అయితే ప్రస్తుతం రిపబ్లికన్ అభ్యర్థులు మెజారిటీగా ఉన్న సెనేట్​లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ సభలో నెగ్గితేనే ట్రంప్ పదవీచ్యుతుడవుతారు. ఈ నేపథ్యంలో ఓ టీవి ఛానెల్​కు ఇచ్చిన ముఖాముఖిలో ఉక్రెయిన్ వ్యవహారంలో అధ్యక్షుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు పెలోసీ.

" అధ్యక్షుడు ట్రంప్​పై అభిశంసన పెట్టాల్సింది కాదు. అయితే రాజ్యాంగ నిబంధనలను విస్మరించి ప్రవర్తించడం కారణంగా ఇది తప్పడం లేదు."

-నాన్సీ పెలోసీ, అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల సభ స్పీకర్

త్వరలో అభిశంసనకు సంబంధించిన పత్రాలను సెనేట్​కు పంపనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు పెలోసీ. అభిశంసన పత్రాలను సెనేట్​కు పంపడంలో ఆలస్యం చేయడంపై సమర్థించుకున్నారు.

ఇదీ చూడండి: 'చర్చలకు రండి'.. హ్యారీకి ఎలిజబెత్​ రాణి ఆదేశం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details