ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విలయతాండవం కొనసాగుతోంది. ఇప్పటివరకు 5కోట్ల 19 లక్షలకుపైగా వైరస్ కేసులు నమోదయ్యాయి. వారిలో 12లక్షల 82వేల మందికిపైగా కరోనాకు బలయ్యారు. ఇప్పటివరకు 3కోట్ల 64లక్షల మందికిపైగా మహమ్మారిని జయించారు. 74లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి.
- కరోనా కేసుల పరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటివరకు 1.05కోట్ల కేసులు నమోదయ్యాయి. వారిలో 2.45 లక్షల మందికిపైగా మరణించారు.
- నేపాల్లో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజులోనే 2,736 మంది కరోనా బారినపడ్డారు. బాధితుల సంఖ్య 2లక్షలకు సమీపించింది. మరో 22 మరణాలతో.. మృతుల సంఖ్య 1,148కి చేరింది.
- పాక్లో మరో 1,637 మందికి వైరస్ ఉన్నట్టు తేలింది. ఫలితంగా బాధితుల సంఖ్య 3లక్షల 47వేల 476కు చేరింది. మరో 23 మంది మృతిచెందడం వల్ల.. ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 7వేల మార్క్కు చేరింది.