తెలంగాణ

telangana

ETV Bharat / international

మోదీ-ట్రంప్​ మైత్రి.. ఇమ్రాన్​ యుద్ధ హెచ్చరికలు - కశ్మీర్​ అంశంపై భారత్​కు యుద్ధ హెచ్చరికలు జారీ చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్​.

కశ్మీర్​ అంశంపై భారత్​కు యుద్ధ హెచ్చరికలు జారీ చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్​. మోదీ-ట్రంప్​ సాన్నిహిత్యాన్ని ప్రపంచ దేశాలు గమనిస్తున్న తరుణంలో పాక్​ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాశమైంది.

మోదీ-ట్రంప్​ మైత్రి.. ఇమ్రాన్​ యుద్ధ హెచ్చరికలు

By

Published : Sep 26, 2019, 5:21 AM IST

Updated : Oct 2, 2019, 1:17 AM IST

మోదీ-ట్రంప్​ మైత్రి.. ఇమ్రాన్​ యుద్ధ హెచ్చరికలు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్..​ తమ మధ్య ఉన్న స్నేహాన్ని ప్రపంచదేశాలకు చాటిచెబుతున్న తరుణంలో పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ కుట్రపూరిత వైఖరిని మరోసారి బహిర్గతం చేశారు. తాజాగా కశ్మీర్​లో ఆంక్షలు కొనసాగితే యుద్ధం తప్పదని భారత్​ను హెచ్చరించారు.

"50 రోజుల నుంచి 9 లక్షల సైనికుల వల్ల కశ్మీర్ ప్రజలు అణచివేతకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో బహిరంగంగా జైలు వంటి పరిస్థితిలో 80 లక్షల మంది ఉండటం ఎన్నడూ జరగలేదు. కర్ఫ్యూను ఎత్తేసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయన్నది ఆందోళనకర అంశం. ఏదో ఒక సమయంలో రెండు అణ్వాయుధ దేశాలు ఎదురుపడక తప్పదు. యుద్ధం వచ్చే ప్రమాదముంది."
--- ఇమ్రాన్​ఖాన్​, పాకిస్థాన్​ ప్రధాని

ఆగస్టులో కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేసినప్పటి నుంచి భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

భారత్​-పాక్​ ప్రధానులు తమ మధ్య విభేదాలను పరిష్కరించుకోవాలని చెబుతూనే.. మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు ట్రంప్​. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ.. ముడురోజుల వ్యవధిలో ట్రంప్​ను రెండుసార్లు కలిశారు. హౌడీ మోదీ కార్యక్రమంలో పాల్గొని ప్రపంచదేశాలను ఆశ్చర్యానికి గురిచేసిన ట్రంప్​.. అనంతరం మోదీని భారత జాతిపితగా అభివర్ణించారు.

ఇదీ చూడండి:- అంతర్జాతీయ సంస్థల సీఈఓలతో మోదీ భేటీ

Last Updated : Oct 2, 2019, 1:17 AM IST

ABOUT THE AUTHOR

...view details