తెలంగాణ

telangana

ETV Bharat / international

'కులభూషణ్' ​కేసులో పాక్​ వైఖరి తప్పే: ఐసీజే

భారత నావికాదళ మాజీ అధికారి కులభూషణ్​ జాదవ్​ కేసులో పాక్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు అబ్దుల్​కావి ఐరాసకు తెలిపారు. జాదవ్​ నిర్బంధం అక్రమమని పేర్కొన్న ఆయన పాక్ దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

By

Published : Oct 31, 2019, 1:52 PM IST

Updated : Oct 31, 2019, 4:47 PM IST

'కులభూషణ్' ​కేసులో పాక్​ వైఖరి తప్పే: ఐసీజే

'కులభూషణ్' ​కేసులో పాక్​ వైఖరి తప్పే: ఐసీజే

భారత నావికాదళ మాజీ అధికారి కులభూషణ్​ జాదవ్​ కేసులో పాకిస్థాన్​ తీరును అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తప్పుపట్టింది. జాదవ్​ నిర్బంధం పూర్తిగా అక్రమమని..​ వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని ఐసీజే అధ్యక్షుడు అబ్దుల్​కావి యూసుఫ్​ వెల్లడించారు.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న అబ్దుల్​కావి... ఐసీజే నివేదికను సమర్పించారు. కులభూషణ్​ జాదవ్​ కేసుపై జులై 17న వెలువరించిన తీర్పులో వియన్నా నిబంధనలోని ఆర్టికల్ 36ను పాక్ ఉల్లంఘించిందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో తక్షణం దిద్దుబాటు చర్యలు చేట్టాలని ఆయన పాక్​ను ఆదేశించారు.

ఐరాసకు ఫిర్యాదు

జాదవ్​ కేసులో పాక్​ తీరుపై అంతర్జాతీయ న్యాయస్థానం.. ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదుచేసింది. మరోవైపు వియన్నా ఒప్పందం ప్రకారం జాదవ్​ హక్కులను పునరుద్ధరించాలని పాక్​ను ఆదేశించింది ఐసీజే.

భారత్​కు ఘనవిజయం..

రిటైర్డ్​ ఇండియన్ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్​కు పాకిస్థాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించింది. దీనిని అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్​ సవాల్​ చేసింది. వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని పేర్కొంది. కేసును పరిశీలించిన ఐసీజే జాదవ్ మరణశిక్షను నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. ఇది భారత్​కు దక్కిన ఘనవిజయం.

ఇదీ చూడండి:ఇందిరా గాంధీకి కాంగ్రెస్ ప్రముఖుల ఘన నివాళి

Last Updated : Oct 31, 2019, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details