తెలంగాణ

telangana

ETV Bharat / international

బైడెన్​ సమీక్షా బృందాల్లో 20 మంది భారతీయులు

అమెరికాలో అధికార బదిలీకి ఏర్పాట్లు చేసే సమీక్షా బృందాల్లో 20 మందికిపైగా భారతీయులను నియమించారు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్. వీరిలో ముగ్గురు టీం లీడర్లు కూడా ఉన్నారు. ఈ బృందాల్లో మహిళలు, అణగారిన వర్గాలకు పెద్దపీట వేశారు.

By

Published : Nov 11, 2020, 10:24 AM IST

BIDEN ART TEAMS
బైడెన్​

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. తన ఏజెన్సీ సమీక్షా బృందాల్లో (ఏఆర్​టీ) 20 మందికిపైగా భారతసంతతి వ్యక్తులను నియమించారు. ఇందులో ముగ్గురు టీం లీడర్లు కూడా ఉన్నారు. ఈ బృందాలు అధికార బదిలీ ప్రక్రియలో కీలక కార్యకలాపాలు నిర్వహిస్తాయి.

ఇంతవరకు నియమించిన ఏఆర్​టీల్లో ఈ బృందాలే వైవిధ్యమైనవని బైడెన్ ట్రాన్సిషన్ టీం వెల్లడించింది. వందల మంది ఏఆర్​టీ సభ్యుల్లో సగం మంది మహిళలే. మిగిలిన మొత్తంలో సుమారు 40 శాతం మంది దివ్యాంగులు, నల్లజాతీయులు, ఎల్​జీబీటీక్యూ వంటి ప్రభుత్వంలో తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గాలకు చెందినవారు ఉన్నారు.

టీం లీడర్లు వీరే..

బైడెన్ ఏఆర్​టీ బృందాల్లో ముగ్గురు భారతీయ అమెరికన్లు టీం లీడర్లుగా ఉన్నారు. అరుణ్​ ముజుందార్​ (విద్యుత్ శాఖ), రాహుల్ గుప్తా (జాతీయ ఔషధ నియంత్రణ), కిరణ్ అహూజా (అధికారుల నిర్వహణ కార్యాలయం) ఈ జాబితాలో ఉన్నారు.

అధికార బదిలీకి ఏర్పాట్లు..

ఈ బృందాలు ప్రతి సంస్థ, శాఖలోని కార్యకలాపాలను అర్థం చేసుకుని.. అధికార బదిలీ సజావుగా జరిగేలా చూస్తాయి. అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కేబినెట్​ మొదటి నుంచి బాధ్యతలు నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తాయి.

ఇదీ చూడండి:అంతులేని యుద్ధాలకు బైడెన్ స్వస్తి చెబుతారా!

ABOUT THE AUTHOR

...view details