ఫిబ్రవరి 5వ తేదీని 'కశ్మీర్ అమెరికన్ డే'గా గుర్తించాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని న్యూయార్క్ అసెంబ్లీఆమోదించింది . దీన్ని తీవ్రంగా ఖండించిన భారత్... జమ్ము కశ్మీర్ సంస్కృతిని, ఔన్నత్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఇదని విమర్శించింది.
అసెంబ్లీ సభ్యుడు నాదర్ సయేగ్ సహా 12 మంతి శాసనసభ్యులు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. "కశ్మీర్ సమాజం ప్రతికూలతలను అధిగమించింది. పట్టుదలతో ఉంది. న్యూయార్క్ వలసవాదులందరిలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించించుకుంది. కశ్మీరీ ప్రజలకు మత స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ మొదలైన మానవహక్కులను కల్పించడానికి న్యూయార్క్ ప్రయత్నిస్తుంది" అని తీర్మానంలో పేర్కొన్నారు.