తెలంగాణ

telangana

By

Published : Aug 27, 2020, 7:51 PM IST

ETV Bharat / international

ఏటీఎంలపై కన్నేసిన ఉత్తర కొరియా హ్యాకర్లు

ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ఉత్తరకొరియాకు చెందిన కొందరు కేటుగాళ్లు మాత్రం హ్యాకింగ్​తో డబ్బులు కొట్టేసే పనిలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంక్​ ఏటీఎంలే లక్ష్యంగా ఫిషింగ్​ దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది అమెరికా.

N Korean hackers stealing from ATMs worldwide, says US
ఏటీఏంలపై కన్నేసిన ఉత్తర కొరియా హ్యాకర్లు.. ఎందుకంటే.?

సాంకేతికతను తప్పుడు మార్గంలో ఉపయోగించి ప్రజలకు ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నిస్తోంది ఉత్తర కొరియా. ఆ దేశానికి చెందిన పలువురు హ్యాకర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలే లక్ష్యంగా సైబర్​ దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ప్రపంచ దేశాలను హెచ్చరించింది అమెరికా. ఇలా సేకరించిన నిధులను తమ దేశ అణుపరిశోధనల కోసం ఉపయోగించాలని కిమ్​ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపింది.

36 దేశాల్లో దాడులకు ప్రయత్నాలు..

ఉత్తర కొరియా హ్యాకింగ్​ బృందం.. 36 దేశాల్లోని ఏటీఎంల నుంచి 2 బిలియన్ల డాలర్ల మొత్తాన్ని దొంగిలించేందుకు ప్రయత్నాలు చేసినట్లు చెప్పింది అమెరికా. నకిలీ ఈ-మొయిళ్లను పంపి వాటి ద్వారా ఫిషింగ్​ దాడులకు ప్రయత్నించినట్లు స్ఫష్టం చేసింది.

"ఫిబ్రవరి నుంచి ఉత్తర కొరియా బ్యాంక్​లను లక్ష్యంగా చేసుకుంది. పలు దేశాల్లోని ఏటీఎంల నుంచి డబ్బులను ట్రాన్స్​ఫర్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేసింది" అని సైబర్​ సెక్యూరిటీ అండ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ సెక్యూరిటీ ఏజన్సీ(సీఐఎస్ఏ), ట్రెజరీ డిపార్ట్​మెంట్​, ఫెడరల్​ డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఇన్వెస్టిగేషన్​(ఎఫ్​బీఐ), యూఎస్​ సైబర్​ కమాండ్​ కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

హానికరమైన మాల్​వేర్​ సాయంతో బ్యాంక్​ సర్వర్లు, ఆర్థిక సంస్థలను యాక్సెస్​ చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నాలు చేసినట్లు ఆయా సంస్థలు తెలిపాయి. 'ఫాస్ట్​క్యాష్​ 2.0 నార్త్​కొరియా బాగ్లేబాయ్స్​ రాబింగ్​ బ్యాంక్స్​' పేరిట ఓ స్క్రీమ్​ను సైబర్​ నేరగాళ్లు ప్రవేశపెట్టారని.. దాని సాయంతో విభిన్న దేశాల్లో సైబర్​ దాడులకు యత్నించినట్లు అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ మనీ ట్రాన్స్​ఫర్లు, ఏటీఎంలలో క్యాష్​ లేకుండా చేసేందుకు ఈ స్కీమ్ తయారుచేసినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details