తెలంగాణ

telangana

By

Published : May 7, 2020, 12:40 PM IST

ETV Bharat / international

న్యూయార్క్​ కరోనా బాధితుల్లో వాళ్లే అధికం

అమెరికాలోని న్యూయార్క్​లో కరోనా సోకిన వారిలో ఎక్కువ మంది విశ్రాంత ఉద్యోగులు, నిరుద్యోగులే ఉన్నట్లు సర్వేలో తేలింది. వారిలో నాలుగింట మూడొంతుల మంది 50ఏళ్లు పైబడిన వారే కావడం గమనార్హం. వైద్యులు, అత్యవసర సేవల సిబ్బందికే వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉన్నట్లు సర్వే పేర్కొంది.

COVID-19 patients in NY
న్యూయార్క్​లో కరోనా బాధితులలో వాళ్లే అధికం

అమెరికాలోని న్యూయార్స్​ నగరంలో కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. ఆ ప్రాంతంలో వైరస్​ బారిన పడిన వారిలో ఎక్కువ శాతం మంది నిరుద్యోగులు, పదవీ విరమణ చేసిన వారే ఉన్నారని ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలింది. ఆరు వారాలుగా ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నట్లు స్పష్టమైంది.

న్యూయార్క్​లో కరోనా సోకిన వారిలో 37 శాతం మంది విశ్రాంత ఉద్యోగులు, 46 శాతం మంది నిరుద్యోగులు ఉన్నట్లు సర్వే వెల్లడించింది. బాధితుల్లో నాలుగింట మూడొంతుల మంది 50ఏళ్లు పైబడిన వారే. 17 శాతం మంది మాత్రవే ఉద్యోగం చేస్తున్నారు.

మూడురోజుల పాటు 113 ఆస్పత్రులలోని 1,269 మంది కరోనా రోగులపై ఈ సర్వే నిర్వహించారు. వైద్యులు, నర్సులు, రవాణాకు సంబంధించిన ఉద్యోగులే కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు.
శ్వేత జాతీయులకంటే ఆఫ్రికన్-అమెరికన్లు, లాటిన్ అమెరికన్లే వైరస్​ బారిన పడిన వారిలో అధిక సంఖ్యలో ఉన్నట్లు సర్వే వెల్లడించింది.
న్యూయార్క్​లో గత మూడు రోజులుగా వైరస్​ తీవ్రత తగ్గినప్పటికీ సగటున రోజుకు 600కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్​ లక్షణాలు ఉన్న కొంత మంది యుక్త వయస్కుల వారికి ఇంట్లోనే చికిత్స అందిస్తున్నట్లు వైద్య అధికారులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details