తెలంగాణ

telangana

ETV Bharat / international

'మసూద్​పై చైనా గొడుగు ఎందుకు?' - చైనా

జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్​ వ్యవహారంలో చైనా వైఖరిని 'వాల్​స్ట్రీట్' జర్నల్ తప్పుబట్టింది. ప్రమాదకారి అని తేలినప్పటికీ అజార్​కు డ్రాగన్​ దేశం గొడుగు పడుతోందని విమర్శించింది.

జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్

By

Published : Mar 17, 2019, 8:13 AM IST

జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్
జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ విషయంలో చైనా తీరును 'వాల్​స్ట్రీట్ జర్నల్' విమర్శించింది. ప్రమాదకారి అని తేలినా పాకిస్థాన్​ కోసమే అజార్​ను వెనకేసుకొస్తుందని తన సంపాదకీయంలో వివరించింది.

అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదనలకు చైనా అడ్డుపుల్ల వేయటం విస్మయానికి గురిచేసిందని అమెరికా పత్రిక పేర్కొంది. "జిహాదీలకు చైనా గొడుగు-కశ్మీర్​ హంతకుడిపై ఆంక్షలు విధించేందుకు చైనా అడ్డుపుల్ల" శీర్షికతో సంపాదకీయంలో ప్రముఖంగా రాసింది.

కథనంలో పేర్కొన్న అంశాలు

  • ప్రపంచ దేశాలు పాక్​పై ఒత్తిడి తెస్తుంటే చైనా వాటిని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.
  • పాకిస్థాన్​తో సంబంధాల కోసం పదేళ్లుగా అజార్​పై వస్తోన్న ప్రతిపాదనలను చైనా తిరస్కరిస్తోంది.
  • ఉగ్రవాదంపై అర్థవంతమైన చర్యలు తీసుకోకపోతే దానికి పరిష్కారంగా సైనిక చర్య తప్ప మరే ప్రత్యామ్నాయం లేదని భారత్ భావిస్తుంది.
  • పాకిస్థాన్​ వైఖరితో విసిగిపోయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఆ దేశానికి అందిస్తోన్న సైనిక సాయంలో గతేడాది కోత విధించారు. అయితే ఆ లోటును చైనా పూరిస్తోంది.

ఇదీ చూడండి:ఉగ్రవాదంపై చర్చకు 'బ్రిక్స్' పచ్చజెండా

ABOUT THE AUTHOR

...view details