తెలంగాణ

telangana

ETV Bharat / international

మోదీ ట్రంప్​తో సెల్ఫీ బాలుడు ఎవరో తెలుసా? - హ్యూస్టన్​లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో ఓ బాలుడు

హ్యూస్టన్​లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో ఓ బాలుడు భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్​లతో సెల్ఫీ తీసుకున్నాడు. ఇప్పుడది నెట్టింట తెగ వైరల్​ అవుతోంది. ఇంతకీ ఆ బాలుడు ఎవరు?

మోదీ ట్రంప్​తో సెల్ఫీ బాలుడు ఎవరో తెలుసా?

By

Published : Sep 24, 2019, 1:16 PM IST

Updated : Oct 1, 2019, 7:45 PM IST

మోదీ ట్రంప్​తో సెల్ఫీ బాలుడు ఎవరో తెలుసా?

హ్యూస్టన్​లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాని మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​లతో ఓ బాలుడు సెల్ఫీ తీసుకున్నాడు. ఇప్పుడది నెట్టింట వైరల్​ అవుతోంది.

అగ్రనేతలతో స్వీయ చిత్రం తీసుకున్న ఆ బుడతడు ఎవరా? అని ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఆ పిల్లాడు ఎవరో తెలుసా?.. కర్ణాటకకు చెందిన సాత్విక్​ హెగ్డే. కుటుంబంతో కలిసి ఎప్పటినుంచో అమెరికాలో ఉంటున్న 13 ఏళ్ల ఈ బాలుడు... అగ్రనేతలిద్దరితో సెల్ఫీ అవకాశం కొట్టేశాడు.

హౌడీ మోదీ కార్యక్రమంలో ప్రదర్శన చేసేందుకు తన కుటుంబంతో కలిసి వచ్చాడు సాత్విక్​. యోగాలో ప్రావీణ్యం ఉన్న ఇతను భారీ బహిరంగ సభకు హాజరైన 50 వేల మంది ఎదుట సూర్యనమస్కారం ప్రదర్శన చేశాడు.

ప్రసంగాలకు ముందు అగ్రనేతలిద్దరూ పిల్లలవైపు నడుచుకుంటూ వస్తున్న సమయంలో ఇరుదేశాధినేతలను అడిగి, సెల్ఫీ తీసుకున్నాడు సాత్విక్.

ఇదీ చూడండి : వైరల్​: ఆ బాలుడు కోరితే మోదీ, ట్రంప్ కాదనలేకపోయారు!

Last Updated : Oct 1, 2019, 7:45 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details