తెలంగాణ

telangana

బైడెన్​ బృందంలో మరో భారత సంతతి మహిళకు చోటు

By

Published : Jan 15, 2021, 9:18 AM IST

అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో మరో భారతీయ అమెరికన్​కు చోటు దక్కింది. బైడెన్​ కార్యనిర్వహక వర్గంలో ప్రధానమైన నేషనల్​ ఎకనామిక్​ కౌన్సిల్​లో డిప్యూటి డైరెక్టర్​గా కశ్మీర్​ మహిళ సమీరా ఫాజిల్​ను బైడెన్ ఎంపిక చేశారు.

Another Kashmiri origin woman joins US President Joe Biden's team
బైడెన్​ బృందంలో మరో భారత సంతతి మహిళకు చోటు

అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న జో బైడెన్ బృందంలో మరో భారతీయ- అమెరికన్​కు చోటు లభించింది. భారత సంతతికి చెందిన సమీరా ఫాజిల్​ను యూఎస్​ నేషనల్​ ఎకనామిక్​ కౌన్సిల్​కు ఎంపిక చేస్తూ బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో తయారీ, ఆవిష్కరణలు, దేశీయంగా పోటీ వంటి అంశాలను సమీరా పర్యవేక్షించనున్నారు. స్వేతసౌధం డిజిటల్​ విభాగంలో కశ్మీరీ మహిళ ఐషా షాని ఎంపిక చేసిన కొన్ని వారాల తర్వాత.. ప్రస్తుతం సమీర ఎంపిక ప్రకటన వెలువడడం గమనార్హం.

కశ్మీర్​ మూలాలున్న సయ్యద్​ యూసఫ్, రఫిఖా ఫాజిల్​ దంపతుల కుమార్తె సమీరా ఫాజిల్​. సమీరా పూర్వీకులు అమెరికాలో స్థిరపడగా.. ఆమె ప్రస్తుతం క్లినికల్​ లెక్చరర్​గా ఆమె ప్రస్తానాన్ని మొదలు పెట్టారు. రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్​ అట్లాంటాలో సామాజిక ఆర్థిక అభివృద్ధి శాఖకు డైరెక్టర్​గా పనిచేశారు. ట్రెజరీ డిపార్ట్​మెంట్​లోనూ ఆమెకు పనిచేసిన అనుభవం ఉంది.

ఇదీ చదవండి:1.9 ట్రిలియన్​ డాలర్లతో బైడెన్​ ఆర్థిక ప్రణాళిక​

ABOUT THE AUTHOR

...view details