జూన్ 1నుంచి అమెరికాలో కరోనా మరణాల సంఖ్య పెరగనుందని బ్లూమ్బెర్గ్ ప్రజారోగ్య విద్యాసంస్థ తయారుచేసిన అంతర్గత నివేదిక అంచనా వేసింది. రోజుకు 3,000 మంది మృతులు, 2,00,000 కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అమెరికాలోని 24 రాష్ట్రాల్లో.. ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం వివిధ దశల్లో ఉన్న వేళ.. కేసులు, మరణాలు పెరుగుతాయన్న నివేదిక అక్కడి ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
పెరిగిన నిరుద్యోగం..
వైరస్ ప్రభావం అమెరికాలో అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా 12 లక్షలమంది వైరస్ బాధితులు ఉండగా.. 69,000 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కరోనా కారణంగా ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగించింది. మూడు కోట్లమంది అమెరికన్లు నిరుద్యోగం వల్ల వచ్చే ప్రయోజాల కోసం దరఖాస్తు చేయడం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోంది.
అమెరికాలోని రాష్ట్రాలు ఇప్పటికే గత ఏడు వారాలుగా మూసివేతలో ఉన్నాయి. అయితే ఇప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పులేదు. ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు కార్యకలాపాలను పునఃప్రారంభిస్తే పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారవచ్చనిని న్యూయార్క్ టైమ్స్ పత్రిక అభిప్రాయపడింది.
నివేదికపై అనుమానాలు..