తెలంగాణ

telangana

ETV Bharat / international

ఈనెల చివర్లో భారత్​కు ట్రంప్​.. వాణిజ్య ఒప్పందంపై సంతకం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఈ నెల చివరి వారంలో భారత పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలోనే వాణిజ్య ఒప్పందం సహా రక్షణ రంగంలో సహకారంపై కీలక ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వాణిజ్య ఒప్పందానికి ఇరు దేశాల అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలిపాయి.

By

Published : Feb 5, 2020, 5:43 AM IST

Updated : Feb 29, 2020, 5:42 AM IST

President Trump's India visit
ఈనెల చివర్లో భారత్​కు ట్రంప్​.

ఈనెల చివరి వారంలో భారత పర్యటనకు ట్రంప్​

అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మూడేళ్ల తర్వాత తొలిసారి భారత్​లో పర్యటించనున్నారు డొనాల్డ్​ ట్రంప్​. ఈ నెల చివరి వారంలో భారత్​ రానున్నారు​. ఈ పర్యటనతో భారత్​-అమెరికా మధ్య తలెత్తిన వాణిజ్య విభేదాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ట్రంప్​ పర్యటనలోనే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రణాళికలు జరుగుతున్నట్లు తెలిపాయి. కొన్ని నిర్దిష్ట రంగాలను కలుపుకొని చేసే ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి భారత్​, అమెరికా అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం.

"అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పర్యటనలోనే వాణిజ్య ఒప్పందం సహా రక్షణ రంగంలో సహకారంపై ఒప్పందం కుదిరే అవకాశం ఉంది."

- అధికార వర్గాలు.

ఈనెల 23-26 మధ్య..

ఈనెల 23 నుంచి 26 మధ్య రెండు రోజుల పాటు భారత్​లో పర్యటించనున్నారు అధ్యక్షుడు ట్రంప్​. ఈ పర్యటన షెడ్యూల్​ను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు ఇరు దేశాల అధికారులు. ట్రంప్​ పర్యటన ప్రధానంగా దేశ రాజధాని దిల్లీలోనే ఉంటుంది. అయితే.. మరో నగరాన్ని సందర్శించే అంశాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు. అందులో ప్రధానంగా ఆగ్రా, అహ్మదాబాద్​లు ఉన్నాయి.

ట్రంప్​ విదేశీ పర్యటనలను పరిశీలించే ఉన్నత స్థాయి అధికారుల బృందం ఇప్పటికే భారత్​లో పర్యటించింది.

సుంకాల తగ్గింపుపై..

ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా స్టీల్​, అల్యూమినియంపై అమెరికా విధిస్తోన్న అధిక సుంకాల నుంచి మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్​ చేస్తోంది భారత్​. జీఎస్​పీ హోదా కింద పలు ఉత్పత్తుల సుంకాల ప్రయోజనాలను తిరిగి ప్రారంభించాలని కోరుతోంది. వ్యవసాయ, ఆటోమొబైల్​, ఆటో కాంపొనెంట్స్​, ఇంజినీరింగ్​ ఉత్పత్తులపై మార్కెట్​ వసతులు కల్పించాలని అమెరికాపై ఒత్తిడి తెస్తోంది భారత్​.

మరోవైపు.. తమ వ్యవసాయ, తయారీ, పాడి, ఔషధ​ ఉత్పత్తులకు భారత్​లో మార్కెట్​ అవకాశాలు కల్పించాలని అమెరికా కోరుతోంది.

ఎగుమతులు-దిగుమతులు ఇలా..

2018-19లో అమెరికాకు భారత ఎగుమతులు 52.4 బిలియన్​ డాలర్లు కాగా... అదే సమయంలో దిగుమతులు 35.5 బిలియన్​ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్య లోటు​ 2017-18 (21.3 బిలియన్​ డాలర్లు)తో పోలిస్తే 2018-19లో 16.9 బిలియన్​ డాలర్లకు తగ్గింది. ఇదే సమయంలో భారత్​కు విదేశీ పెట్టుబడుల రూపంలో 3.13 బిలియన్​ డాలర్లు ఉచ్చాయి.

ఈఏడాది 71వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ను భారత్​ ఆహ్వానించింది. కానీ.. పలు కారణాలతో రాలేనని చెప్పారు.

ఇదీ చూడండి: కాకస్​లో బోణీ కొట్టిన ట్రంప్​- డెమొక్రాట్లలో గందరగోళం

Last Updated : Feb 29, 2020, 5:42 AM IST

ABOUT THE AUTHOR

...view details