తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఆ రాష్ట్రాల్లో ట్రంప్ భవితను తేల్చేది ఎన్​ఆర్​ఐలే!'

నవంబరులో జరిగే అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్​ ఓటర్లు చాలా కీలకమని డెమొక్రటిక్​ పార్టీ నేత చెప్పారు. మిషిగన్​, పెన్సిల్వేనియా, విస్​కాన్సిన్ వంటి రాష్ట్రాల్లో వాళ్ల ఓట్లే ఫలితాలను నిర్ణయిస్తాయని తెలిపారు. వారి మద్దతు సంపాదించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

By

Published : Jul 19, 2020, 12:17 PM IST

Indian-American voters could make huge difference in battleground states: Top Democratic leader
'అధ్యక్ష ఎన్నికల్లో భారత-అమెరికన్ల ఓట్లు అత్యంత కీలకం'

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా మూడు నెలలు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ అమెరికన్ల ఓట్లు ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమన్నారు డెమొక్రటిక్ పార్టీ జాతీయ​ కమిటీ అధ్యక్షుడు థామస్​ పెరెజ్​. కొన్ని రాష్ట్రాల్లో వారి ఓట్లే ఫలితాలను శాసిస్తాయని తెలిపారు. మిషిగన్, పెన్సిల్వేనియా, విస్​కాన్సిన్​ సహా పలు రాష్ట్రాల్లో భారతీయ అమెరికన్​ ఓటర్లు భారీగా ఉన్నట్లు చెప్పారు.

2016 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్​ చేతిలో హిల్లరీ క్లింటన్​ అపజయాన్ని ప్రస్తావిస్తూ మిషిగన్​లో 10,700 ఓట్ల తేడాతో డెమొక్రటిక్​ పార్టీ ఓడినట్లు గుర్తు చేశారు థామస్.

" పెన్సిల్వేనియాలో 1,56,000 భారతీయ అమెరికన్​ ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అక్కడ 42,000 ఓట్ల తేడాతో ఓడింది. విస్​కాన్సిన్​లో 37వేల ఓట్లున్నాయి. ఆ రాష్ట్రంలో 21వేల ఓట్ల వ్యత్యాసంతో ఓటమి చవిచూశాం. భారతీయ అమెరికన్ల ఓట్లు ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి."

-థామస్​ పెరెజ్, డెమొక్రటిక్ పార్టీ జాతీయ​ కమిటీ అధ్యక్షుడు

ఎన్నికలు రసవత్తరంగా సాగే 8 కీలక రాష్ట్రాల్లో 13 లక్షల మంది భారతీయ అమెరికన్​ ఓటర్లు ఉన్నారని ఏషియన్​-అమెరికన్​ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ విక్టరీ ఫండ్ ఛైర్మన్​ శేఖర్ నరసింహన్​ తెలిపారు.

" ఆరిజోనాలో 66వేలు, ఫ్లోరిడాలో లక్ష 93వేలు, జార్జియాలో లక్ష 50వేలు, మిషిగన్​లో లక్షా 25వేలు, ఉత్తర అమెరికాలో లక్ష 11వేలు, పెన్సిల్వేనియాలో లక్షా 56వేలు, టెక్సాస్​లో 4లక్షల 5వేల మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. వీరిలో 77 శాతం మంది 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన హిల్లరీ క్లింటన్​కే ఓటు వేశారు. ఇప్పుడు నిర్వహించిన అన్ని సర్వేల్లో వీరంతా ట్రంప్​ కంటే బైడెన్​ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు."

-శేఖర్ నరసింహన్​

ఈసారి కూడా భారతీయ అమెరికన్​ ఓటర్లు డెమొక్రాట్స్​కే మద్దతుగా ఉంటారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పైన చెప్పినవారిలో కనీసం 10 లక్షల మంది తమకే అనుకూలంగా ఓటు వేస్తారని అంచనా వేస్తున్నారు. వారికి చేరువయ్యేందుకు కార్యక్రమాలు చేపట్టాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఇదీ చూడండి: కరోనా సామూహిక పరీక్షలకు అత్యవసర అనుమతి

ABOUT THE AUTHOR

...view details