తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా ఎఫ్​సీసీలో భారత సంతతి మహిళకు కీలక పదవి - ఫెడరల్​ కమ్యూనికేషన్​ కమిషన్​

అమెరికాలో సమచార వ్యవస్థను నియంత్రించే ఫెడరల్​ కమ్యూనికేషన్స్​ కమిషన్​ (ఎఫ్​సీసీ)లోని సాంకేతిక విభాగానికి తొలి మహిళా చీఫ్​గా భారత సంతతికి చెందిన డా.మోనీష ఘోష్​ నియమితులయ్యారు. సాంకేతిక, ఇంజినీరింగ్​ సమస్యలపై సంస్థ ఛైర్మన్​కు సలహాలు అందించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు ఘోష్.​

Dr Monisha Ghosh
అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం

By

Published : Dec 22, 2019, 11:34 AM IST

అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. సమచార వ్యవస్థను నియంత్రించే స్వతంత్ర వ్యవస్థ దేశ ఫెడరల్​ కమ్యూనికేషన్స్​ కమిషన్ (ఎఫ్​సీసీ)​లో సాంకేతిక విభాగం అధిపతిగా డా.మోనీష ఘోష్​ నియామకమయ్యారు. ఎఫ్​సీసీ సాంకేతిక విభాగంలో తొలి మహిళా చీఫ్​ రికార్డ్​ సృష్టించారు. ఎఫ్​సీసీలో ఇండో-అమెరికన్​ ఛైర్మన్​ అజిత్​ పాయ్​తో పాటు సంస్థకు సాంకేతికత, ఇంజినీరింగ్​ సమస్యల్లో సలహాలు అందించనున్నారు ఘోష్​. ఇంజినీరింగ్​ అండ్​ టెక్నాలజీ విభాగానికి అనుబంధంగా పని చేయనున్నారు.

ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న డా.ఎరిక్​ బర్గెర్​ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు మోనీష. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఎఫ్​సీసీ..

రేడియో, టెలివిజన్​, వైర్​, సాటిలైట్​, కెబుల్​ వంటి రంగాల్లో అమెరికాలోని కొలంబియా జిల్లాలు, 50 రాష్ట్రాల్లో.. అంతర్​రాష్ట్రాల మధ్య, అంతర్జాతీయంగా సమాచార వ్యవస్థను నియంత్రిస్తుంది ఫెడరల్​ కమ్యూనికేషన్​ కమిషన్​ (ఎఫ్​సీసీ).

ఎన్​ఎస్​ఎఫ్​లో విధులు..

2017 నుంచి నేషనల్​ సైన్స్​ ఫౌండేషన్​లోని కంప్యూటర్​ అండ్​ నెట్​వర్క్​ సిస్టమ్​ విభాగంలో ప్రోగ్రాం డైరెక్టర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు మోనిష ఘోష్​.

ఇదీ చూడండి: వరదల్లో సుందరమైన వెనిస్ నగరం

ABOUT THE AUTHOR

...view details