అమెరికాలో భారత సంతతి మహిళ పియా దాండియాకు అపూర్వ గౌరవం లభించింది. 2020-21 ఏడాదికి గాను 'వైట్హౌస్ ఫెలో'గా ఎంపికైన 14 మందిలో ఆమెకు చోటు దక్కింది.
విద్యా శాఖలో దాండియాను నియమించినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. దాండియా నిర్వహిస్తున్న విద్యాసంస్థ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి విద్యనందించటంలో విశేష కృషి చేసిందని శ్వేతసౌధం ప్రకటనలో తెలిపింది.
ప్రస్తతం న్యూయార్క్లోని హర్లీమ్లో డెమొక్రసీ ప్రెప్ ఎండ్యురెన్స్ హైస్కూల్కు వ్యవస్థాపక ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నారు దాండియా. 28 ఏళ్లకే బాధ్యతలు స్వీకరించి పిన్న వయస్కురాలైన ప్రిన్సిపల్గా నిలిచారు.