తెలంగాణ

telangana

By

Published : Jul 23, 2020, 5:16 AM IST

ETV Bharat / international

అత్యాధునిక డ్రోన్ల అభివృద్ధికి భారత్​-అమెరికా చర్చలు

గాలిలో ప్రయోగించే అత్యాధునిక డ్రోన్ల(యూఏవీ) అభివృద్ధికి భారత్​-అమెరికా మధ్య చర్చలు జరగుతున్నాయి. ఈ విషయాన్ని పెంటగాన్​కు చెందిన ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్​పై భారత వాయుసేనతో పాటు భారత్​కు చెందిన ఓ అంకుర సంస్థతో కలిసి అమెరికా వాయుసేన పని చేయనున్నట్టు పేర్కొన్నారు.

India, US negotiating UAV co-development programme, says Pentagon official
అత్యాధునిక డ్రోన్ల అభివృద్ధికి భారత్​-అమెరికా చర్చలు

అత్యాధునిక డ్రోన్ల అభివృద్ధికి భారత్​-అమెరికా మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ మేరకు ఇండియా ఐడియాస్​ సదస్సులో అగ్రరాజ్య రక్షణ విభాగం పెంటగాన్​కు చెందిన ఉన్నతాధికారి వెల్లడించారు.

"వాయు మార్గంలో ప్రయోగించే యూఏవీ(అన్​మానెడ్​ ఏరియల్​ వెహికిల్​)ని అభివృద్ధి చేసేందుకు అమెరికా-భారత్​ మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. అమెరికా వాయుసేనకు చెందిన ఓ పరిశోధన ల్యాబ్​.. భారత్ వాయుసేన, భారత రక్షణ-పరిశోధన సంస్థ,​ భారత్​కు చెందిన ఓ అంకుర సంస్థ కలిసి ఈ డ్రోన్లను అభివృద్ధి చేస్తాయి."

-- ఎల్లన్​ లార్డ్​, పెంటగాన్​ అధికారి.

సెప్టెంబర్​ 14న అమెరికా- భారత్​ డీటీటీఐ(యూఎస్​-ఇండియా డిఫెన్స్​ టెక్నాలజీ అండ్​ ట్రేడ్​ ఇనిషియేటివ్​) సమావేశం జరుగుతుందని లార్డ్​ వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయని వ్యాఖ్యానించారు. దీని వల్ల ఇండో-పెసిఫిక్​ ప్రాంతంలో మరింత స్థిరత్వం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details