వాణిజ్య సత్సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా భారత్-అమెరికా కీలక నిర్ణయాలు తీసుకున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బృందం పేర్కొంది. ద్వైపాక్షిక వాణిజ్య సమస్యలపై ఇరు దేశాలు కలిసి కట్టుగా కృషి చేయనున్నట్లు వెల్లడించింది.
'వాణిజ్య సమస్యలను కలిసి పరిష్కరించుకుందాం' - పియూష్ గోయల్
వాణిజ్య సమస్యలను పరిష్కరించుకునే దిశగా భారత్-అమెరికా దేశాలు అడుగులేశాయి. ఈ మేరకు ఇరు దేశాల వాణిజ్య శాఖ మంత్రులు ఫోన్ సంభాషణ జరిపారు.
!['వాణిజ్య సమస్యలను కలిసి పరిష్కరించుకుందాం' India-US to resolve key bilateral trade issues](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11162110-thumbnail-3x2-ind-us.jpg)
'వాణిజ్య సమస్యలపై కలిసికట్టుగా పోరాడుదాం'
ఈ మేరకు.. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల గురించి భారత వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్తో షోన్లో మాట్లాడారు అమెరికా వాణిజ్య రాయబారి క్యాథరీన్ తాయ్. 2021లో ట్రేడ్ పాలసీ ఫోరమ్కు సంబంధించి ఇరు దేశాల మంత్రులు సమావేశం కానున్నట్లు తెలిపారు.