తెలంగాణ

telangana

ETV Bharat / international

యూఎన్​ఎస్​సీలో 3 కీలక కమిటీలకు భారత్​ అధ్యక్షత - తాలిబన్​ లిబియా ఆంక్షల కమిటీ

తాత్కాలిక సభ్యదేశంగా యూఎన్​ఎస్​సీలోని తన రెండేళ్ల పదవీకాలంలో.. కీలక తాలిబన్​, లిబియా ఆంక్షల కమిటీకి అధ్యక్షత వహించనుంది భారత్​. వీటితో పాటు 2022లో ఉగ్రవాద నిరోధన కమిటీ కూడా భారత్​ నేతృత్వంలోనే సాగుతుంది.

India to chair UNSC's crucial Taliban and Libya sanctions committees, panel on counter-terrorism
'యూఎన్​ఎస్​సీలో మూడు కీలక కమిటీలకు భారత్​ నేతృత్వం'

By

Published : Jan 8, 2021, 2:25 PM IST

ఐరాస భద్రతా మండలి(యూఎన్​ఎస్​సీ)లో తాత్కాలిక సభ్యదేశంగా ఉన్న భారత్​.. తన పదవీ కాలంలో కీలక తాలిబన్​, లిబియా ఆంక్షల కమిటీతో పాటు ఉగ్రవాద నిరోధక కమిటీకి అధ్యక్షత వహించనుంది. ఈ విషయాన్ని ఐరాసలో భారత శాశ్వత రాయబారి టీఎస్​ తిరుమూర్తి వెల్లడించారు.

టీఎస్​ తిరుమూర్తి

"భద్రతా మండలిలో మూడు కీలకమైన కమిటీలకు అధ్యక్షత వహించాలని భారత్​ను కోరారు. ఈ విషయాన్ని వెల్లడించేందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అవి.. తాలిబన్​ ఆంక్షల కమిటీ, ఉగ్రవాద నిరోధక కమిటీ(సీటీసీ), లిబియా ఆంక్షల కమిటీ. ఆఫ్ఘానిస్థాన్​లో శాంతి, భద్రత, అభివృద్ధికి కట్టుబడి ఉన్న భారత్​కు ఇది అత్యంత ప్రాధాన్యంతో కూడిన విషయం. 2022లో సీటీసీకి భారత్​ అధ్యక్షత వహిస్తుంది. అదే సమయంలో భారత్​ 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడం విశేషం."

--- టీఎస్​ తిరుమూర్తి, ఐరాసలోని భారత శాశ్వత రాయబారి.

గత శుక్రవారం.. యూఎన్​ఎస్​సీలో రెండేళ్ల ప్రస్థానాన్ని ప్రారంభించింది భారత్​.

ఇదీ చూడండి:-'ఉగ్రవాదంపై గళమెత్తేందుకు భారత్​ వెనకాడదు'

ABOUT THE AUTHOR

...view details