జీ-7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాధించిన ఐదు విజయాల్లో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించే దిశగా కృషి చేయడం ఒకటని అమెరికా శ్వేతసౌధ వర్గాలు ప్రకటించాయి. ఫ్రాన్స్లోని బీయరజ్ వేదికగా ఆగస్టు 24-26 మధ్య జరిగిన జీ-7 సమావేశంలో పాల్గొన్న ట్రంప్ స్వదేశానికి చేరుకున్న అనంతరం శ్వేతసౌధం ఈ విధంగా పేర్కొంది.
భారత ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన చర్చల్లో భారత్-పాక్ల మధ్య సంప్రదింపుల గురించి ట్రంప్ ప్రస్తావించారని పేర్కొంది వైట్హౌస్. భారత్-అమెరికాల మధ్య బలమైన ఆర్థిక బంధం కోసం ట్రంప్ ప్రయత్నించారని స్పష్టం చేసింది.
ఐదు విజయాలు ఇవే...