తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్​-పాక్​ మధ్య శాంతి... ట్రంప్​ విజయమే!'

భారత్​-పాకిస్థాన్​ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్.. జీ-7 సమావేశంలో సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటని ప్రకటించింది శ్వేతసౌధ కార్యాలయం. ఇరుదేశాల మధ్య చర్చల గురించి ట్రంప్ ప్రస్తావించారని పేర్కొంది. జీ-7 వేదికగా మోదీ-ట్రంప్ మధ్య జరిగిన ఆహ్లాదకర సంభాషణ చిత్రాన్ని ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్​ చేసింది.

By

Published : Aug 27, 2019, 6:57 PM IST

Updated : Sep 28, 2019, 12:06 PM IST

భారత్​-పాక్ ఉద్రిక్తతలు తగ్గేందుకు ట్రంప్​ కృషి: శ్వేతసౌధం

జీ-7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాధించిన ఐదు విజయాల్లో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించే దిశగా కృషి చేయడం ఒకటని అమెరికా శ్వేతసౌధ వర్గాలు ప్రకటించాయి. ఫ్రాన్స్​లోని బీయరజ్​​ వేదికగా ఆగస్టు 24-26 మధ్య జరిగిన జీ-7 సమావేశంలో పాల్గొన్న ట్రంప్ స్వదేశానికి చేరుకున్న అనంతరం శ్వేతసౌధం ఈ విధంగా పేర్కొంది.

భారత ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన చర్చల్లో భారత్‌-పాక్​ల మధ్య సంప్రదింపుల గురించి ట్రంప్ ప్రస్తావించారని పేర్కొంది వైట్​హౌస్. భారత్‌-అమెరికాల మధ్య బలమైన ఆర్థిక బంధం కోసం ట్రంప్ ప్రయత్నించారని స్పష్టం చేసింది.

ఐదు విజయాలు ఇవే...

"ఐక్యతా సందేశం, బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం, అమెరికా-మెక్సికో-కెనడా మధ్య ఒప్పందం, ఐరోపా దేశాలతో సుదృఢ వాణిజ్య మైత్రి, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి అనేవి ఐదు అతిపెద్ద విజయాలు."

-శ్వేతసౌధం ప్రకటన

మోదీతో సమావేశంలో అఫ్గానిస్థాన్​ అంశంలో అమెరికాకు భారత్ కీలక భాగస్వామి అని ట్రంప్ పేర్కొన్నారని శ్వేతసౌధ కార్యాలయం ట్విట్టర్​ ద్వారా ప్రకటించింది. సోమవారం నాటి సమావేశంలో ఇద్దరు నేతల మధ్య జరిగిన ఆహ్లాదకర సన్నివేశ చిత్రాలను పోస్ట్​ చేసింది.

ఇదీ చూడండి: చిన్ని ఏనుగు చింత వీడె- మిత్రులతో గెంతులేసె!

Last Updated : Sep 28, 2019, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details