తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెజాన్​ కార్చిచ్చు ఆర్పేందుకు ముమ్మర చర్యలు

వాతావరణంలో 20శాతం ఆక్సిజన్​ అందిస్తున్న అమెజాన్​ అడవుల్లో కార్చిచ్చులు పెరిగిపోతున్నాయి. ఇటీవల బ్రెజిల్​ రాండోనియా రాష్ట్రంలోని అడవుల్లో మంటలు చెలరేగాయి. వాటిని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది.

By

Published : Aug 27, 2019, 4:01 PM IST

Updated : Sep 28, 2019, 11:36 AM IST

అమెజాన్​ కార్చిచ్చు ఆర్పేందుకు ముమ్మర చర్యలు

అమెజాన్​ కార్చిచ్చు ఆర్పేందుకు ముమ్మర చర్యలు

భూమిపై వాయుకాలుష్య నియంత్రణలో, ఉష్ణోగ్రతల పెరుగుదలను ఎదుర్కోవడంలో అమెజాన్​ అడవులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవల ఇక్కడ కార్చిచ్చులు పెరిగిపోయాయి. గత వారం రోజుల నుంచి అవి మరింత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.

తాజాగా బ్రెజిల్​ దేశంలోని రాండోనియా రాష్ట్రానికి చెందిన అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపుచేసేందుకు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు.

జీ-7 స్పందన

ఫ్రాన్స్​లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సులో అమెజాన్​ అడవుల సంరక్షణకై బృందం నుంచి 20 మిలియన్​ డాలర్లను ప్రకటించారు. ఇక బ్రిటన్​ 12 మిలియన్​ డాలర్లు, కెనడా 11 మిలియన్​ డాలర్లను ప్రకటించింది.

ఇదీ చూడండి:అమెరికా: భారీ విస్ఫోటనానికి భవనం ఆహుతి

Last Updated : Sep 28, 2019, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details