తెలంగాణ

telangana

By

Published : Sep 20, 2019, 9:22 AM IST

Updated : Oct 1, 2019, 7:17 AM IST

ETV Bharat / international

ట్రంప్-మోదీ భారీ బహిరంగ సభకు తుపాను ముప్పు!

అమెరికా హ్యూస్టన్​లో సుమారు 50 వేల మంది భారతీయ అమెరికన్లతో భారీ ఎత్తున చేపడుతున్న 'హౌదీ-మోదీ' కార్యక్రమానికి తుపాను ముప్పు పొంచి ఉంది. ఆదివారం జరగనున్న ఈ సభకు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ హాజరుకానున్నారు.  కార్యక్రమానికి రెండు రోజుల ముందు టెక్సాస్​ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని అధికారులు అంచనావేస్తున్నారు.

ట్రంప్-మోదీ భారీ బహిరంగ సభకు తుపాను ముప్పు

ట్రంప్-మోదీ భారీ బహిరంగ సభకు తుపాను ముప్పు!

అమెరికా టెక్సాస్​లో హ్యూస్టన్​ వేదికగా భారతీయ అమెరికన్లు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'హౌదీ-మోదీ' కార్యక్రమానికి తపాను ముప్పు పొంచి ఉంది. సుమారు 50 వేల మంది భారతీయ అమెరికన్లు పాల్గొనే ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ఒకే వేదిక పంచుకోనున్నారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిర్వాహకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో.. గురువారం టెక్సాస్​ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇమెల్డా తుపాను విరుచుకుపడింది. దీని ప్రభావానికి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తాయి. హ్యూస్టన్​ నగరంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరో మూడు రోజుల వరకు తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగ్నేయ టెక్సాస్​లోని 13 కౌంటీల్లో అత్యవసర పరిస్థితి విధించారు​. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

నిర్వాహకుల్లో ఆందోళన...

భారీ వర్షాలతో 'హౌదీ-మోదీ' కార్యక్రమం నిర్వాహకుల్లో ఆందోళన పెరిగింది. కానీ తుపాను ముప్పు ఉన్నప్పటికీ సభను విజయవంతం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హ్యూస్టన్​లోని విశాలమైన ఎన్​ఆర్​జీ మైదానానికి హాజరయ్యే వారందరికీ వారి జీవితమంతా ఎంతో ఆనందాన్ని ఇచ్చే అనుభవం ఉంటుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

1500 మంది వాలంటీర్లు...

ఆదివారం జరగబోయే హౌదీ-మోదీ కార్యక్రమం కోసం సుమారు 1500 మంది వాలంటీర్లు 24 గంటలు కష్టపడుతున్నారు. ఈ సమావేశం ద్వారా హ్యూస్టన్​, అమెరికాలో భారతీయ-అమెరికన్ల సంఖ్యలో పెరుగుతున్న పరిమాణం, శక్తిని ప్రతిబింబించనుంది.

ప్రముఖుల హాజరు...

హౌదీ-మోదీ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షడు డొనాల్డ్​ ట్రంప్​తో పాటు అక్కడి ప్రభుత్వ ఉన్నతాధికారులు, గవర్నర్లు, కాంగ్రెస్​ సభ్యులు, మేయర్లు హాజరవుతున్నారు. సమావేశంలో భాగంగా భారత ప్రధాని మోదీతో పాటు వారంతా సమావేశమవుతారు.

ఇదీ చూడండి: ఆసియా దేశాల సైనిక విన్యాసాలు అదరహో..!

Last Updated : Oct 1, 2019, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details