తెలంగాణ

telangana

ETV Bharat / international

13 మంది అధికారులను బలిగొన్న డ్రగ్స్​ ముఠా

సెంట్రల్​ మెక్సికోలో మాదక ద్రవ్యాల ముఠా 13 మంది అధికారులను కాల్చి చంపింది. చనిపోయిన వారిలో 8 మంది పోలీసులు కాగా మరో 5మంది ప్రాసిక్యూషన్​ సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

By

Published : Mar 19, 2021, 12:14 PM IST

Gunmen ambush police convoy near Mexico City, killing 13
13 మంది అధికారులను కాల్చి చంపిన డ్రగ్​ ముఠా

సెంట్రల్​ మెక్సికోలో దారుణం జరిగింది. మాదక ద్రవ్యాల ముఠాకు చెందిన కొందరు 13 మందిని కాల్చి చంపారు. ఇందులో 8 మంది పోలీసులు ఉండగా.. మరో 5 మంది ప్రాసిక్యూషన్ సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

2019లో జరిగిన ఘటనలో మొత్తం 14 మంది అధికారులు ఒకేసారి హత్యకు గురయ్యారు. తరువాతి కాలంలో ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారి అని పోలీసులు వెల్లడించారు.

హంతకుల కోసం సైనికులు, మెరైన్​ పోలీసులు, జాతీయ భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు భద్రతా విభాగం అధిపతి రోడ్రిగో మార్టినెజ్​ సెలిస్​ తెలిపారు.

"దాడి జరిగిన ప్రాంతంలో చాలా మంది ఉన్నారు. ఈ దాడి ఏ ముఠా సభ్యులు చేశారు అనే దానిపై స్పష్టత లేదు. ఇది కేవలం అధికారులను చంపడంగా మేము భావించడం లేదు. మెక్సికన్​ ప్రభుత్వంపై దాడిగా పరిగణిస్తున్నాం. ఇప్పటికే అన్ని దళాలను అప్రమత్తం చేశాం."

- రోడ్రిగో మార్టినెజ్​ సెలిస్, భద్రతా విభాగం అధిపతి

ఇదీ చూడండి:'హెచ్​-1బీ వీసాలపై నిషేధం ఎత్తివేయండి'

ABOUT THE AUTHOR

...view details