తెలంగాణ

telangana

'టీకా అభివృద్ధిలో భారత్​ కృషి భేష్​'

By

Published : Jan 5, 2021, 2:15 PM IST

కరోనా వైరస్​ను నిర్మూలించే దిశగా మానవాళి కోసం టీకాను అభివృద్ధి చేస్తోన్న భారత్​కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. వ్యాక్సిన్​ ఉత్పత్తిలో భారత శాస్త్రవేత్తల కృషిని, ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని పలువురు నేతలు కీర్తించారు.

Global leaders hail India's scientific innovation, decisive action to combat COVID-19
'టీకా అభివృద్ధిలో భారత్​ కృషి భేష్​'

కరోనా మహమ్మారిని అంతం చేసే దిశగా భారత వైజ్ఞానిక రంగం చేస్తున్న కృషిని ప్రపంచ స్థాయి నాయకులు కీర్తిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం కారణంగానే ప్రపంచ దేశాలకు కొవిడ్​ టీకా అందించడంలో భారత్​ కేంద్రంగా మారిందని కితాబిచ్చారు.

"కరోనా వైరస్​ను అంతం చేసే దిశగా.. టీకా అభివృద్ధి చేయడంలో భారత వైజ్ఞానిక రంగం కృషిని అభినందించక తప్పదు. సమర్థ నాయకత్వంతోనే ఇది సాధ్యం అయింది."

-బిల్​గేట్స్​, బిల్​&మిలిందా గేట్స్ ఫౌండేషన్​​ సహ వ్యవస్థాపకుడు

"ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తిదారుగా భారత్​ నిలిచింది. నిరంతర కృషితో కరోనాకు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. నిర్ణయాత్మక చర్యలతో మహమ్మారికి ముగింపు పలకబోతున్నాం. అందరం కలిసికట్టుగా ఉంటే కరోనా మహమ్మారిని అంతం చేయవచ్చు. భారత్ ఉత్పత్తి చేస్తోన్న టీకాలపై మాకు విశ్వాసం ఉంది. ఈ టీకాలు వైరస్​ నుంచి సమర్థంగా, సురక్షితంగా ప్రపంచ మానవాళిని రక్షించగలవని నమ్ముతున్నాం."

- టెడ్రోస్‌ అధనామ్‌, డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్

డీసీజీఐ భారత్​లో అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్​లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. ప్రపంచంలోనే పెద్దమొత్తంలో టీకాలు వేసే ప్రక్రియ దేశంలో ప్రారంభం కానున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. 'మేకిన్​ ఇండియా'లో భాగంగా ఉత్పత్పి చేస్తోన్న కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ టీకాలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల బృందంపై ప్రశంసలు కురిపించారు మోదీ.

దేశీయంగా తయారు చేస్తోన్న వస్తువులకు 'ప్రపంచ స్థాయిలో డిమాండ్​ పెరగడమే కాక ప్రజామోదం పొందగలవు" అని అన్నారు. ఈ క్రమంలో సమస్త మానవాళికి టీకాను అందించడంలో భారత్​ ముందుంటుందని తెలిపారు. వైరస్​ విజృంభిస్తున్న సమయంలోనూ 150కు పైగా దేశాలకు వైద్య ఉత్పత్తులను అందించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇదీ చూడండి: 'కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ 100 శాతం సురక్షితం'

ABOUT THE AUTHOR

...view details