కరోనా మహమ్మారిని అంతం చేసే దిశగా భారత వైజ్ఞానిక రంగం చేస్తున్న కృషిని ప్రపంచ స్థాయి నాయకులు కీర్తిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం కారణంగానే ప్రపంచ దేశాలకు కొవిడ్ టీకా అందించడంలో భారత్ కేంద్రంగా మారిందని కితాబిచ్చారు.
"కరోనా వైరస్ను అంతం చేసే దిశగా.. టీకా అభివృద్ధి చేయడంలో భారత వైజ్ఞానిక రంగం కృషిని అభినందించక తప్పదు. సమర్థ నాయకత్వంతోనే ఇది సాధ్యం అయింది."
-బిల్గేట్స్, బిల్&మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు
"ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తిదారుగా భారత్ నిలిచింది. నిరంతర కృషితో కరోనాకు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. నిర్ణయాత్మక చర్యలతో మహమ్మారికి ముగింపు పలకబోతున్నాం. అందరం కలిసికట్టుగా ఉంటే కరోనా మహమ్మారిని అంతం చేయవచ్చు. భారత్ ఉత్పత్తి చేస్తోన్న టీకాలపై మాకు విశ్వాసం ఉంది. ఈ టీకాలు వైరస్ నుంచి సమర్థంగా, సురక్షితంగా ప్రపంచ మానవాళిని రక్షించగలవని నమ్ముతున్నాం."