తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా పంజా.. ఒక్కరోజే లక్షా 60వేల మందికి వైరస్ - South Korea

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజులో లక్షా 60 వేలమందికి వైరస్ నిర్ధరణ అయింది. కొత్తగా 3415 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటివరకు 56 లక్షలమందిలో వైరస్ నయమైంది.

world
ప్రపంచంపై కరోనా పంజా

By

Published : Jun 30, 2020, 7:28 AM IST

కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. సోమవారం ఒక్కరోజే లక్షా 60 వేల కేసులు నమోదయ్యాయి. అమెరికాలో కొత్తగా 44,234 మందికి వైరస్​ సోకింది. 346 మంది ప్రాణాలు కోల్పోయారు.

అక్కడ 25 వేలమందికి..

బ్రెజిల్​లో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. ఒక్కరోజులో 25వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 727 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరో 6 వేలమందికి వైరస్..

రష్యాలో గడచిన 24 గంటల్లో 6719 మందికి వైరస్ సోకింది. మరో 93 మంది ప్రాణాలు కోల్పోయారు. 4 లక్షల 3 వేలమందిలో వైరస్ నయమైంది.

ప్రపంచంలో కరోనా గణాంకాలు

ఇదీ చూడండి: భారత్​ భూభాగంలోకి చొరబడిన చైనా

ABOUT THE AUTHOR

...view details