ప్రాణాంతక కరోనాతో పాటు ఇతర ప్రమాదకర వైరస్ రకాలను సమర్థంగా నిరోధించే మాత్రల (పిల్స్) తయారీకి అమెరికా సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.23,745 కోట్లను (3.2 బిలియన్ డాలర్లు) కేటాయించనున్నట్లు ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు డా.ఆంటోనీ ఫౌచీ గురువారం వెల్లడించారు.
రూ. 23 వేల కోట్ల మాత్రలతో కరోనాకు చెక్! - dr fauci latest on covid
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాతో పాటు పలు ప్రమాదకర వైరస్లను ఎదుర్కొనే దిశగా అగ్రరాజ్యం అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ప్రాజెక్ట్ను చేపట్టింది. దీనికోసం సుమారు రూ. 23,745 కోట్లను కేటాయించనున్నట్లు ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డా. ఆంటోని ఫౌచీ తెలిపారు.

ఆంటోని ఫౌచి
ప్రమాదకర వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే వినియోగించుకునేందుకు ఈ మాత్రలు ఉపయోగపడతాయని, ఈ ఏడాది చివరికి అందుబాటులోకి వస్తాయని శ్వేతసౌధం వద్ద నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన తెలిపారు.
ఇదీ చూడండి:రెండు వేర్వేరు టీకా డోసులు కలపొచ్చా?