తెలంగాణ

telangana

అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం

By

Published : Dec 13, 2020, 2:50 AM IST

Updated : Dec 13, 2020, 7:32 AM IST

Mahatma Gandhi
అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం

06:13 December 13

అమెరికా వాషింగ్టన్​లోని భారత రాయబార కార్యాలయం ముందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఖలిస్థానీ వేర్పాటువాదులు. భారత్​లో కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సిక్కు-అమెరికన్లు చేపట్టిన నిరసనల సందర్భంగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.  

భారత్​లో నిరసనలు చేస్తోన్న రైతులకు సంఘీభావంగా..  గ్రేటర్​ వాషింగ్టన్​ డీసీ, మేరీలాండ్​, వర్జీనియాలతో పాటు న్యూయార్క్​, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, ఇండియానా, ఓహియో, నార్త్​ కరోలినా వంటి రాష్ట్రాల నుంచి వందల మంది సిక్కులు ఆందోళనలు చేపట్టారు. వాషింగ్టన్​ డీసీలోని భారత రాయబార కార్యాలయం వద్ద కార్ల ర్యాలీ నిర్వహించారు.  

అయితే.. శాంతియుతంగా జరుగుతున్న నిరసనల్లో వేర్పాటువాద సిక్కులు ఖలిస్థానీ జెండాలు, భారత వ్యతిరేక పోస్టర్లు, బ్యానర్లతో ప్రవేశించటంతో ఉద్రిక్తంగా మారాయి. వారంతా 'ద రిపబ్లిక్​ ఆఫ్​ ఖలిస్థాన్​'కు చెందినవారిగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా చాలా మంది ఖలిస్థానీ అనుకూల సిక్కు యువత.. మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి భారత్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోస్టర్లను గాంధీ విగ్రహంపై ఉంచారు.

ఖండించిన భారత్

మహాత్మా గాంధీ విగ్రహంపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండించింది అమెరికాలోని భారత రాయబార కార్యాలయం. ఈ అంశంపై అమెరికా పోలీసు విభాగం వద్ద నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపింది. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. 

02:45 December 13

అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం

అమెరికా వాషింగ్టన్​ డీసీలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని కొంతమంది నిరసనకారులు ధ్వంసం చేశారు. భారత రాయబార కార్యాలయం వద్ద ఉన్న ఈ విగ్రహాన్ని భారతదేశంలో నూతన సాగు చట్టాలపై నిరసన చేస్తోన్న వ్యక్తులు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఘటనాస్థలిలో ఖలిస్థాన్​ జెండాలు దొరకడం గమనార్హం.

Last Updated : Dec 13, 2020, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details