అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ స్వాగతించినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. జో బైడెన్ను అమెరికా తదుపరి అధ్యక్షుడిగా అంగీకరించిన తొలి దిగ్గజ సాంకేతిక సంస్థ అధిపతిగా నిలిచారని పేర్కొంది.
నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించిన విషయం స్పష్టమైందని జుకర్బర్గ్ తన సంస్థలోని ఉద్యోగులకు చెప్పారని బజ్ఫీడ్ అనే వార్తా సంస్థ పేర్కొంది.
"ఎన్నికల ఫలితం ఇప్పుడు స్పష్టంగా ఉంది. జో బైడెన్ మన తదుపరి అధ్యక్షుడు కాబోతున్నారు. ఎన్నికలు ప్రాథమికంగా సవ్యంగానే జరిగాయని ప్రజలు విశ్వసించడం ముఖ్యం. ట్రంప్కు ఓటేసిన కోట్లాది మంది ప్రజలకూ ఇదే వర్తిస్తుంది."