తెలంగాణ

telangana

By

Published : Sep 3, 2019, 6:49 AM IST

Updated : Sep 29, 2019, 6:10 AM IST

ETV Bharat / international

కాలిఫోర్నియా పడవ ప్రమాదంలో 8 మంది మృతి

దక్షిణ కాలిఫోర్నియాలో అగ్నిప్రమాదానికి గురైన పడవలో 8 మృతదేహాలను తీర ప్రాంత రక్షణదళాలు వెలికి తీశాయి. ప్రమాద సమయంలో పడవలోని సిబ్బంది బయటికి దూకి ప్రాణాలు రక్షించుకోగా.. ఇతరుల జాడ ఇంకా తెలియరాలేదు.

నిప్పుల్లో చిక్కుకున్న పడవ

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఓ పడవ అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు.శాంటాక్రూజ్​ దీవిలోని ఈ బోటు స్కూబా డైవింగ్​కు చెందింది. అకస్మాత్తుగా పడవకు మంటలు అంటుకోవడం వల్ల ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో 26 మంది ఆచూకీ గల్లంతైంది. వారంతా మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

ప్రమాద సమయంలో ప్రయాణికులు పడవ కింది భాగంలో ఉన్న కారణంగా.. వారు తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని తీర రక్షణదళ అధికారులు తెలిపారు. ఎవరైనా సజీవంగా ఉంటే రక్షించేందుకు రక్షణ దళాలు గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. హెలికాప్టర్లు, చిన్న పడవలు, కోస్టల్​ గార్డ్​ పడవలతో గాలింపు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు.

ప్రమాదానికి గురైన పడవలో ఐదుగురు సిబ్బందితో కలిపి మొత్తం 39 మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. పడవ సిబ్బంది ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే బయటకు దూకడం వల్ల వారిని రక్షించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: డోరైన్​ తుపానుకు బహమాస్​ అతలాకుతలం

Last Updated : Sep 29, 2019, 6:10 AM IST

ABOUT THE AUTHOR

...view details