తెలంగాణ

telangana

Ecuador Landslide: కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి

By

Published : Feb 2, 2022, 1:59 AM IST

Ecuador Landslide: ఈక్వెడార్​ రాజధాని క్విటోలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 22 మంది మృతిచెందారు. మరో 32 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

Ecuador Landslide
Ecuador Landslide

Ecuador Landslide: ఈక్వెడార్ రాజధానిలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 22 మంది మరణించిగా.. మరో 32 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. శిథిలాలు నివాసం ప్రాంతంలో పడటం వల్ల ఎనిమిది ఇళ్లు ధ్వంసమయ్యాయి. నగర వీధులు, క్రీడా మైదానాల్లోకి బురద నీరు ప్రవేశించింది.

క్విటో నగర వీధుల్లో బురద

రూకో పిచించా పర్వత శ్రేణుల దిగువన ఉన్న లా గాస్కా, లా కొమునా పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. ఫలితంగా వరదలు ముంచెత్తాయి. దాదాపు 10 అడుగుల ఎత్తు మేర బురద నీరు నగరాల్లో ప్రవేశించింది. దాంతో పాటే చెట్లు, పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ​

నగర వీధుల్లో ప్రవహిస్తున్న బురద నీరు

ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సిబ్బందితో పాటు ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

నివాస ప్రాంతాల్లోకి కొట్టికొచ్చిన చెట్లు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:కంట్రోల్​ తప్పిన రాకెట్.. అస్తవ్యస్తంగా చక్కర్లు​.. మార్చిలో చంద్రుడ్ని ఢీ!

ABOUT THE AUTHOR

...view details