తెలంగాణ

telangana

By

Published : Apr 23, 2020, 11:44 AM IST

ETV Bharat / international

ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా మృతదేహాలు

కరోనా వైరస్​తో బ్రెజిల్​ విలవిలలాడుతోంది. ముఖ్యంగా అమెజోనస్​ రాష్ట్ర రాజధాని మనౌస్​లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. రోజురోజుకు మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా పబ్లిక్​ సిమెట్రీలను తెరిచింది ప్రభుత్వం. ఇప్పుడు వాటిల్లోకి భారీ సంఖ్యలో మృతదేహాలు వచ్చిచేరుతున్నాయి.

dozens-of-coffins-arrive-at-brazil-mass-grave
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా మృతదేహాలు

ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా మృతదేహాలు

మనౌస్​.. కరోనా వైరస్​తో అతలాకుతలమవుతున్న బ్రెజిల్​ దేశంలోని ఓ నగరం. ఈ అమెజోనస్​ రాష్ట్ర రాజధానిలో రోజు రోజుకు కరోనా మరణాలు పెరిపోతున్నాయి. అందువల్ల పబ్లిక్​ సిమెట్రీల(శ్మశానవాటికలు)ను తెరిచింది అక్కడి ప్రభుత్వం. తెరిచిన ఒక్క రోజుకే మృతదేహాలు కుప్పలుకుప్పలుగా వచ్చి చేరాయి. బంధువులు, మిత్రుల కన్నీటి వీడ్కోలు మధ్య వాటిని ఖననం చేశారు.

సామూహిక ఖననం కోసం...
విలపిస్తున్న బంధువులు

అధికార గణాంకాల ప్రకారం... రోజుకు సగటున 30 మృతదేహాలను ఖననం చేస్తారు. కానీ కరోనా విజృంభణ వల్ల ఆ సంఖ్య 100కు చేరింది. రాష్ట్రంలోని 80శాతం కేసులు మనౌస్​ నుంచే ఉండటం కూడా ఇందుకు ఓ కారణం.

కరోనా రోగి మృతదేహానికి అంత్యక్రియలు
వందల సంఖ్యలో సమాధులు

బ్రెజిల్​వ్యాప్తంగా 43వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 2,700మంది మరణిచారు. అయితే ఈ లెక్కల్లో నిజం లేదని.. కేసులు, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశముందని ఆ దేశ గవర్నర్లే అభిప్రాయపడటం గమనార్హం.

ఇదీ చూడండి:-రెండు పెంపుడు పిల్లులకు కరోనా పాజిటివ్​!

ABOUT THE AUTHOR

...view details