తెలంగాణ

telangana

By

Published : Jan 25, 2020, 1:29 PM IST

Updated : Feb 18, 2020, 8:45 AM IST

ETV Bharat / international

అభిశంసన: సెనేట్​లో ముగిసిన డెమోక్రాట్ల వాదనలు

సుదీర్ఘ చర్చ అనంతరం అమెరికా ఎగువసభలో ట్రంప్​ అభిశంసనపై డెమోక్రాట్ల వాదనలు ముగిశాయి. అభిశంసనపై విచారణ నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్​ చేశారు డెమోక్రాట్లు. నేటి నుంచి మూడు రోజుల పాటీ ట్రంప్​ తరఫున అటార్నీలు తమ వాదనలను వినిపించనున్నారు.

Democrats conclude opening arguments in Senate impeachment trial
ట్రంప్​ అభిశంసన: సెనేట్​లో ముగిసిన డెమోక్రాట్ల వాదనలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అభిశంసనపై సెనేట్​లో సుదీర్ఘ చర్చ సాగుతోంది. మూడు రోజుల వాడీవేడీ చర్చల అనంతరం డెమొక్రాట్లు తమ వాదనలను పూర్తి చేశారు. ట్రంప్​ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని... ఈ అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని హౌజ్ మేనేజర్లు డిమాండ్​ చేశారు.

ట్రంప్​ అభిశంసనపై ప్రతినిధుల సభ న్యాయవిచారణ బృందానికి సారథ్యం వహిస్తున్న అడమ్​ స్కిఫ్... కాంగ్రెస్​ కార్యకలాపాలకు ట్రంప్​ ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

డెమొక్రాట్ల వాదనలు ముగిసిన నేపథ్యంలో నేటి నుంచి ట్రంప్​కు చెందిన అటార్నీలు తమ వాదనలు వినిపించనున్నారు. డెమోక్రాట్లలాగే వీరికీ మూడురోజుల సమయం ఇవ్వనున్నారు.

అమెరికా అధ్యక్షునిపై సెనేట్​లో విచారణ జరగడం ఆ దేశ చరిత్రలో ఇది మూడోసారి. అభిశంసన ప్రక్రియను నెలల తరబడి కొనసాగించడాన్ని ట్రంప్​ తప్పుబట్టారు. తానూ ఏ తప్పూ చేయలేదని.. వెంటనే అభిశంసన తీర్మానాన్ని కొట్టివేయాలని సెనేట్​ను కోరారు.

ట్రంప్​ అభిశంసనకు దిగువ సభ ఇప్పటికే ఆమోదం తెలిపింది. రిపబ్లికన్ల మెజారిటీ(53)ఉన్న ఎగువ సభలో అభిశంసన తీర్మానం ఆమోదం పొందే అవకాశం లేదు. ఇందుకు మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం.

ఇదీ చూడండి:- 10 రోజుల్లోనే 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం!

Last Updated : Feb 18, 2020, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details