అమెరికాలో అధికార మార్పిడిపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించినప్పటికీ, అధ్యక్షుడు ట్రంప్ దానిని అంగీకరించటం లేదు. రిగ్గింగ్కు పాల్పడ్డారంటూ కోర్టుల్లో దావాలు వేశారు. మరోవైపు డెమొక్రాట్లు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హుందాగా అధికార మార్పిడికి ట్రంప్ సహకరించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో అమెరికా మాజీ ప్రథమ మహిళ, బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ఒబామా ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. 'అహం కన్నా ప్రజాస్వామ్యం గొప్పది' అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత అనుభవాలను ఆమె గుర్తు చేసుకున్నారు.
అలా చేస్తేనే ప్రజాస్వామ్యానికి బలం
"డెమొక్రాట్లను ఓడించి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు చాలా బాధపడ్డా. కానీ, అప్పట్లో అమెరికన్ ఓటర్లు ట్రంప్నకు పట్టం గట్టారు. ఓటమిని అంగీకరించి, అధికార మార్పిడికి సహకరించాం. అంతకుముందు జార్జి బుష్, లారా శ్వేతసౌధాన్ని వీడినప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఇప్పుడు అలాగే చేయాలని సిబ్బందికి చెప్పాం. ప్రశాంత వాతావరణంలో అధికార మార్పిడి జరగడం అమెరికా ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తుంది" అని మిచెల్ ఒబామా అన్నారు.
హుందాగా వ్యవహరించాం