తెలంగాణ

telangana

ETV Bharat / international

'వ్యాక్సిన్​తో లాభం లేదు.. కరోనాతో జీవించాల్సిందే'

వ్యాక్సిన్​... వ్యాక్సిన్​... వ్యాక్సిన్​.. కరోనాపై పోరులో అత్యంత కీలకంగా భావిస్తోన్న టీకా తయారీ​ కోసం ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే వ్యాక్సిన్​ను అభివృద్ధి చేసినప్పటికీ.. ఎలాంటి లాభం ఉండదని, కరోనాతో కలిసి జీవించాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హెచ్​ఐవీలాగే ఈ కరోనా వైరస్​ కూడా మనిషి జీవితంలో ఉండిపోతుందని విశ్వసిస్తున్నారు.

By

Published : May 28, 2020, 4:21 PM IST

Covid may never go away even with a vaccine : Report
'వ్యాక్సిన్​తోనూ లాభం లేదు.. కరోనాతో జీవించాల్సిందే'

కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ను కనుగొనేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాత్రి- పగలు తేడా లేకుండా తమ మేథోసంపత్తిని వ్యాక్సిన్​ను రూపొందించడం కోసం నిరంతరం ఉపయోగిస్తూనే ఉన్నారు శాస్త్రవేత్తలు. అయితే కరోనాకు వ్యాక్సిన్​ అభివృద్ధి చేసి.. ప్రజలకు అందించినప్పటికీ ఎలాంటి లాభం లేదని ప్రముఖ వార్తా సంస్థ వాషింగ్టన్​ పోస్ట్​ నివేదించింది. వైరస్​ మరికొన్నేళ్లు ఇలాగే ఉంటుందని పేర్కొంది. హెచ్​ఐవీ, మీసిల్స్​, చికెన్​ పాక్స్​ లాగే భూమిపై ఉండిపోవచ్చని వెల్లడించింది.

కరోనాతో సహజీవనం చేయకతప్పదన్న విషయాన్ని అమెరికా గుర్తించి.. వైరస్​పై పోరుకు ప్రణాళికలు రచించాలని అగ్రరాజ్యానికి చెందిన ఎపిడమాలజీ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎన్నో అనిశ్చితులున్నప్పటికీ.. కరోనాతో కలిసి జీవించడం మాత్రం స్పష్టంగా కనపడుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి వైరస్​ సోకలేదని, వారందరూ ప్రమాదంలో ఉన్నట్లేనని వెల్లడించారు.

'వైరస్​ ఉండటానికే ఇక్కడకి వచ్చింది. కానీ దానితో సహజీవనం చేస్తూ మనం భద్రంగా ఉండటం ఎలాగా అనేదే అసలైన ప్రశ్న' అని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఎపిడమాలజిస్ట్​ సారా కోబే అభిప్రాయపడ్డారు.

అయితే కరోనా వైరస్​ ప్రతాపం తగ్గుముఖం పట్టొచ్చని పలువురు నిపుణులు విశ్వసిస్తున్నారు. మనిషి రోగ నిరోధక శక్తి.. వైరస్​కు అలవాటు పడుతుందన్నారు. కానీ దీనికి చాలా సమయం పడుతుందని స్పష్టం చేశారు.

వ్యాక్సిన్​ను అభివృద్ది చేసిన అనంతరం దాని పంపిణీ ఎంతో క్లిష్టమని మరికొందరు తెలిపారు. తొలినాళ్లలో.. వైరస్​ సోకిన జనాభాకు సరిపడా వ్యాక్సిన్​ డోసులు తయారు చేయడం అంత సులభం కాదన్నారు. అంతర్జాతీయ సమాజం మధ్య సహకారం లేకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయన్నారు.

ఈ సంక్షోభం వల్ల ప్రజల్లో పెద్దగా మార్పులు రావని మిన్నిసొట విశ్వవిద్యాలయంలోని మైఖెల్​ టీ ఓస్టర్​హోమ్​ వెల్లడించారు.

"ఇంత జరిగినా ప్రజలు దీర్ఘకాలిక ప్రణాళికలు చేసుకోరు. తమకో, తమ సన్నిహితులకో వైరస్​ సోకితే తప్ప ప్రజలు మారరు. ఈ పరిస్థితి అతివేగంతో డ్రైవింగ్​ చేయడం లాంటిది. దారి మధ్యలో ఏదైనా రోడ్డు ప్రమాద ఘటన కనపడితే.. మన వాహన వేగం కొంత సమయం నెమ్మదిస్తుంది. ఆ తర్వాత తిరిగి పాత కథే. అదే వేగంతో మనం వాహనం నడుపుతాం."

--- మైఖెల్, మిన్నిపొటి విశ్వవిద్యాలయం

ABOUT THE AUTHOR

...view details