కరోనా మహమ్మారిపై పోరాటానికి అంతర్జాతీయ సహకారం ఆవశ్యకత అంశంపై భారత్ సహా మొత్తం 6 దేశాల విదేశాంగ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అమెరిగా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో. కొవిడ్ను జయించేందుకు పరస్పర సహకారం, పారదర్శకత, జవాబుదారీతనంపై ఆరు దేశాల ప్రతినిధులతో చర్చించినట్లు అగ్రరాజ్యం అధికార ప్రతినిధి తెలిపారు.
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా విదేశాంగ మంత్రులు మరైస్ పేనీ, ఎర్నెస్టో హెర్నిక్, యిస్రాయెల్ కట్జ్, టారో కోనో, కంగ్ క్యుంగ్ వాలతో పాంపియో మాట్లాడినట్లు అధికారులు వెల్లడించారు..