తెలంగాణ

telangana

By

Published : May 1, 2021, 5:46 AM IST

ETV Bharat / international

'భారత్​లో పరిస్థితులు విషాదకరం.. సాయం చేస్తాం'

భారత్​లో పరిస్థితులు చాలా విషాదకరంగా ఉన్నాయని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. కరోనాపై పోరాడుతున్న భారత్​కు తాము సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

కమలా హరీస్

భారత్​లో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా ఉందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. కరోనా పోరులో భారత్​కు సాయం చేయడానికి అమెరికా కట్టుబడి ఉందని తెలిపారు.

"భారత్​లో పరిస్థితులు కచ్చితంగా విషాదకరమైనవి. కరోనా వల్ల చాలా మంది చనిపోతున్నారు. మేము ఇంతకు ముందు చెప్పాం, ఇప్పుడు చెబుతున్నాం.. భారత్​కు సాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంటుంది. పీపీఈ కిట్లకు తదితరాలకు అమెరికా ఇప్పటికే సాయం చేసింది."

-కమలా హారిస్, అమెరికా ఉపాధ్యక్షురాలు

భారత్​కు అమెరికా నుంచి సాయం అందడం పట్ల భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యులు.. అధ్యక్షుడు జో బైడెన్​కు ధన్యవాదాలు తెలిపారు. భారత్​కు మరింత సాయం చేయాలని కోరారు. ఆక్సిజన్ సిలిండర్​లే కాకుండా ఇండియాకు రెమ్​డెసివిర్ లాంటి మందుల అవసరం ఉందని అన్నారు.

ఇదీ చదవండి:భారత్​కు సాయం చేసేందుకు సిద్ధం: ఐరాస

ABOUT THE AUTHOR

...view details