తెలంగాణ

telangana

By

Published : Jul 11, 2020, 9:26 AM IST

Updated : Jul 11, 2020, 9:56 AM IST

ETV Bharat / international

అమెరికాపై కరోనా పంజా.. ఒక్కరోజే 71 వేల కేసులు

ప్రపంచంపై కరోనా వైరస్​ పంజా విసురుతోంది. అమెరికా, బ్రెజిల్​లో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య కోటీ 26 లక్షలు దాటింది. 5,62,769 మంది వైరస్​కు బలయ్యారు.

CORONA VIRUS WORLD WIDE SITUATION
ప్రపంచంపై కరోనా పంజా.. 1.27కోట్లకు చేరువలో కేసులు

ప్రపంచంపై కరోనా వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,26,25,156 మందికి కరోనా సోకింది. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 5,62,769 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్​ దేశాలపై కరోనా వైరస్​ పంజా విసురుతోంది.

అగ్రరాజ్యంలో ఒక్కరోజులోనే కొత్తగా 71 వేల కేసులు నమోదయ్యాయి. మరో 849 మంది మరణించారు. బ్రెజిల్​లోనూ వైరస్​ విజృింభిస్తోంది. శుక్రవారం మరో 45 వేలమందికిపైగా కరోనా బారినపడ్డారు. 1270 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశం కేసులు మృతులు
అమెరికా 32,91,786 1,36,671
బ్రెజిల్​ 18,04,338 70,524
రష్యా 7,13,936 11,017
పెరూ 3,19,646 11,500
చిలీ 3,09,274 6,781
స్పెయిన్​ 3,00,988 28,403
మెక్సికో 2,89,174 34,191
బ్రిటన్​ 2,88,133 44,650
ఇరాన్​ 2,52,720 12,447

సెనేట్​ అధ్యక్షురాలికి...

బొలీవియా సెనేట్​ అధ్యక్షురాలు 'మోనికా ఇవా కోపా'కు కరోనా వైరస్​ నిర్థరణ అయ్యింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆమె ట్వీట్​ చేశారు. వర్చువల్​ విధానంలో విధులు నిర్వర్తిస్తానని వెల్లడించారు. ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలికి కరోనా సోకినట్టు ప్రకటించిన ఒక రోజు అనంతరం మోనికా ఈ ప్రకటన చేయడం గమనార్హం.

బొలీవియావ్యాప్తంగా 44 వేల కేసులు నమోదయ్యాయి. 1,600 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:-లాక్​డౌన్​లో బర్త్​డే పార్టీ.. రూ. లక్షల్లో జరిమానా​

Last Updated : Jul 11, 2020, 9:56 AM IST

ABOUT THE AUTHOR

...view details