తెలంగాణ

telangana

By

Published : Dec 28, 2020, 9:24 AM IST

ETV Bharat / international

గర్భిణీలకు కరోనా టీకాపై మరింత అధ్యయనం

ఈ మధ్య కాలంలో కరోనా గురించి కొన్ని వార్తలు చదువుతుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. సాధారణ మానవుల్లో రోగనిరోధక శక్తి సంగతి అటుంచితే.. గర్భిణులపై కొవిడ్​ చూపే ప్రభావం పుట్టబోయే పిల్లలపై పడుతుందనే వార్త కాస్త కంగారు పెట్టిస్తుంది. కరోనా సోకిన తల్లుల యాంటీబాడీలు పిల్లలకు బదిలీ కావట్లేదని తాజా అధ్యయనంలో తేలింది.

Study sheds light on critical windows in pregnancy for COVID-19 vaccination
గర్భిణిలకు కరోనా టీకాపై మరింత అధ్యయనం

మూడో త్రైమాసికంలో కొవిడ్-19 సోకిన గర్భిణుల్లో యాంటీబాడీలు తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు అంతగా బదిలీ కావడం లేదని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఇన్​ఫ్లుయెంజా, కోరింత దగ్గు సోకిన వారికి యాంటీబాడీలు సాధారణంగానే బదిలీ అవుతున్నాయి. సార్స్-కోవ్​-2 విషయంలో మాత్రం అంతగా యాంటీబాడీలు తల్లి నుంచి పిండానికి చేరడం లేదని, చేరినా అవి అంతగా ప్రభావం చూపడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో గర్భిణులకు టీకా ఎప్పుడు వేయాలన్న అంశం చాలా కీలకమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మూడో త్రైమాసికంలో మాత్రమే ఈ యాంటీబాడీల బదిలీ సక్రమంగా జరగడం లేదన్న విషయం తమ అధ్యయనంలో స్పష్టమైందని చెబుతున్నారు. గర్భిణులకు టీకా తయారుచేసే వారికి తమ పరిశోధనలో వెల్లడైన అంశాలు ఉపయోగపడతాయని వారు అభిప్రాయపడ్డారు. అమెరికాలోని మస్సాచుసెట్స్​ జనరల్​ హాస్పిటల్​(ఎంజీహెచ్​)తో కలసి నిర్వహించిన ఈ అధ్యయనాన్ని 'సెల్'​ జర్నల్​ ప్రచురించింది.

ఇదీ చదవండి:ఆక్స్​ఫర్డ్​ టీకా జనవరి తొలివారంలో?

ABOUT THE AUTHOR

...view details