తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఛోక్సీ ఇప్పటికీ భారతీయుడే' - మెహుల్‌ ఛోక్సీ పౌరసత్వంపై విచారణ

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్​ ఛోక్సీ భారత పౌరసత్వాన్ని వదులుకున్నారన్న వాదన పూర్తిగా తప్పని భారత అధికారులు డొమినికా కోర్టుకు వెల్లడించారు. భారత చట్టాల ప్రకారం అతని పౌరసత్వానికి సంబంధించి తప్పుడు నివేదికలు సమర్పించినట్లు పేర్కొన్నారు.

Choksi
ఛోక్సీ

By

Published : Jun 15, 2021, 5:48 AM IST

Updated : Jun 15, 2021, 9:06 AM IST

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ) కుంభకోణం కేసులో డొమినికాలో అరెస్టైన వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ ఇప్పటికీ భారతీయుడేనని.. పౌరసత్వాన్ని రద్దుచేయాలన్న అతని దరఖాస్తు తిరస్కరణకు గురైందని డొమినికా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో భారత అధికారులు స్పష్టం చేశారు. 1955-పౌరసత్వ చట్టం ప్రకారం పౌరసత్వాన్ని వదులుకున్నట్లు తప్పుడు సమాచారం అందించాడని వెల్లడించారు.

ఆంటిగ్వా, బార్బుడాల్లో ఛోక్సీ మోసపూరితంగా పౌరసత్వం పొందారని.. అందువల్ల ఇక్కడి ప్రభుత్వాలు అతని పౌరసత్వ రద్దు అంశాన్ని పరిశీలించాలని ఇప్పటికే కోర్టు దృష్టికి తీసుకువచ్చినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఛోక్సీ భారత్​లో చేసిన ఆర్థిక నేరాలకు సంబంధించి భారతీయ దర్యాప్తు సంస్థలు విచారణ అనుమతి కోరుతున్నట్లు భారత హైకమిషన్‌ తెలిపింది. ఇప్పటికే ఛోక్సీ బెయిల్ పిటిషన్​ను డొమినికా హైకోర్టు తిరస్కరించింది.

Last Updated : Jun 15, 2021, 9:06 AM IST

ABOUT THE AUTHOR

...view details