తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా పంజా: ఏ దేశంలో ఎన్ని కేసులు? - కరోనావైరస్ భద్రత

ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా మహమ్మారి. ఆ వైరస్​ కారణంగా ఇప్పటివరకు 27, 365మంది ప్రాణాలు కోల్పోయారు. 5,97,267 మందికి కరోనా సోకింది. చైనాలో గడిచిన 24 గంటల్లో ముగ్గురు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అక్కడ 3,128మంది ప్రస్తుతం వైరస్​తో బాధపడుతున్నారు.

corona-global
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు

By

Published : Mar 28, 2020, 10:34 AM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కరోనా. ఇప్పటివరకు 27, 365మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 5,97, 267మంది ఈ వైరస్ బారినపడ్డారు. 1,33,363 మందికి వ్యాధి నయమైంది. 1, 04, 205 కేసులతో వైరస్ సోకిన వారి సంఖ్యలో అమెరికా మొదటిస్థానంలో ఉంది. 9,134 మరణాలతో ఇటలీ మరణాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

కరోనా ప్రపంచ గణాంకాలు

చైనాలో పెరుగుతున్న కేసులు..

చైనాలో కరోనా వైరస్ కారణంగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విదేశాల నుంచి చైనాకు వెళ్లిన 54 మందికి కొత్తగా కొవిడ్- 19 సోకిందని నిర్ధరణ అయింది. మరో 29 మందికి వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు.

చైనాలో ప్రస్తుతం 3,128 మంది కరోనాతో బాధపడుతున్నారు. వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,295. మొత్తం బాధితుల సంఖ్య 81, 394.

హాంకాంగ్​లో వైరస్ కారణంగా కొత్తగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 518 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:కరోనాపై పోరు: భారత్​కు అమెరికా ఆర్థిక సాయం

ABOUT THE AUTHOR

...view details