తెలంగాణ

telangana

కరోనా లెక్కలపై సొంత ప్రభుత్వంపైనే అధ్యక్షుడికి డౌట్

By

Published : Mar 28, 2020, 11:20 AM IST

కరోనా మరణాల గణాంకాలపై సొంత ప్రభుత్వం మీదే అనుమానం వ్యక్తం చేశారు బ్రెజిల్​ అధ్యక్షుడు బోల్సొనారొ. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని సావోపాలో గవర్నర్​పై మండిపడ్డారు. లాటిన్​ అమెరికాలో మరెక్కడా లేని విధంగా బ్రెజిల్​లోనే అత్యధికంగా కొవిడ్​ మరణాలు సంభవించాయనడంపై అభ్యంతరం తెలిపారు.

Bolsonaro questions number of Brazil virus deaths
కరోనా మరణ గణాంకాలపై ప్రభుత్వాన్నే విశ్వసించని అధ్యక్షుడు

దేశంలో కరోనా మరణాలపై సొంత ప్రభుత్వం చెప్పిన లెక్కలపైనే అనుమానం వ్యక్తం చేశారు బ్రెజిల్​ అధ్యక్షుడు జైర్ బోల్సొనారొ. సావోపాలో రాష్ట్రంలోని కరోనా మరణాల లెక్కలను తాను నమ్మడం లేదని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం గణాంకాలను తప్పుగా చూపిస్తున్నారని సావోపాలో గవర్నర్​ జోవో డోరియాపై తీవ్ర ఆరోపణలు చేశారు బ్రెజిల్ అధ్యక్షుడు.

మరెక్కడా లేనన్ని..

బ్రెజిల్​లో ఇప్పటివరకు 92 కరోనా మరణాలు సంభవించాయి. ఇందులో 68... ఒక్క సావోపాలోలోనే నమోదయ్యాయి. లాటిన్​ అమెరికావ్యాప్తంగా సంభవించిన మరణాలకన్నా ఎక్కువగా ఉన్న ఈ సంఖ్యపై అనుమానం వ్యక్తంచేశారు బోల్సొనారొ. గతంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఉన్న సావోపాలో రాష్ట్ర గవర్నర్​ జోవో డోరియా.. రాజకీయ ప్రయోజనాల కోసం నాటకాలాడుతున్నారని దుమ్మెత్తిపోశారు. ఇలాంటి విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయన్నారు.

ఇదీ చూడండి: కరోనాపై పోరు: భారత్​కు అమెరికా ఆర్థిక సాయం

ABOUT THE AUTHOR

...view details