తెలంగాణ

telangana

ETV Bharat / international

Road Accident: బస్సు లోయలో పడి 21 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదంలో (Road Accident) 21 మంది మృతి చెందారు. ఓ బస్సు లోయలో పడిపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. సుమారు 200 మీటర్లు ఎత్తు నుంచి బస్సు పడినట్లు అధికారులు తెలిపారు.

By

Published : Sep 7, 2021, 10:56 AM IST

Updated : Sep 7, 2021, 11:28 AM IST

road accident in Bolivia
బస్సు ప్రమాదం

బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. అంతేగాకుండా సుమారు 10 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించారు. మధ్య బొలీవియా ప్రాంతంలోని ఓ లోయలో బస్సు పడి ఈ దుర్ఘటన జరిగింది.

బస్సు సుమారు 200 మీటర్లు ఎత్తు నుంచి పడిందని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ బస్సు మోరచాటా అనే పట్టణం నుంచి కొచ్చాబాంబకు వెళ్తుండగా ఈ ప్రమాంది జరిగింది.

ఇదీ చూడండి:China BRI 'చైనా చేపట్టిన ఆ ప్రాజెక్ట్​తో పర్యావరణానికి ప్రమాదం'

Last Updated : Sep 7, 2021, 11:28 AM IST

ABOUT THE AUTHOR

...view details