గ్రీన్హౌస్ వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 2030 నాటికి ఈ కాలుష్యాన్ని 50-52 శాతం తగ్గించేలా నూతన ప్రణాళికను గురువారం ఆవిష్కరించనున్నారు. ఈ రాత్రికి ప్రారంభం కానున్న లీడర్స్ సమిట్లో ఈ లక్ష్యాలను వివరించనున్నారు.
వాతావరణ మార్పులపై జరిగే ఈ సదస్సు(లీడర్స్ సమిట్ ఆన్ క్లైమెట్)లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా, 40 దేశాల అధినేతలు పాల్గొననున్నారు. బైడెన్ నేతృత్వంలో వాతావరణ సమస్యలపై అమెరికా నిర్వహిస్తున్న తొలి శిఖరాగ్ర సదస్సు ఇదే. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.