తెలంగాణ

telangana

ETV Bharat / international

'ప్రమాణ స్వీకారం'లో కరోనా మృతులకు నివాళి

అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కరోనా మృతులకు సంఘీభావం తెలపనున్నారు. మరణించినవారి జ్ఞాపకార్థం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా చర్చిల్లో గంటలు మోగించనున్నారు.

By

Published : Jan 1, 2021, 3:25 PM IST

Biden inauguration eve to feature memorial ceremony for COVID-19 victims
'ప్రమాణస్వీకారం'లో కరోనా మృతులకు సంఘీభావం

కరోనాతో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్లకు జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా సంఘీభావం ప్రకటించనున్నారు. మృతుల జ్ఞాపకార్థం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.

జనవరి 19న సాయంత్రం 5.30 గంటలకు దేశవ్యాప్తంగా మెమోరియల్​లు నిర్వహించనున్నట్లు అధ్యక్షుడి ప్రమాణస్వీకార కమిటీ(పీఐసీ) తెలిపింది. వాషింగ్టన్​లోని 'లింకన్ మెమోరియల్ రిఫ్లెక్టింగ్ పూల్​'లో లైటింగ్ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలను ఆహ్వానించనున్నట్లు స్పష్టం చేసింది. ఆ సమయంలో దేశంలోని చర్చిలన్నీ గంట మోగించాలని పిలుపునిచ్చింది.

అమెరికా 46వ అధ్యక్షుడిగా జనవరి 20న బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కరోనా మహమ్మారి వల్ల నిరాడంబరంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:బైడెన్​ ప్రమాణ స్వీకారానికి ట్రంప్​ వెళతారా?

ABOUT THE AUTHOR

...view details