తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి - US

కాల్పుల ఘటనతో అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. టెక్సాస్​ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 3 గంటలకు గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో మరో 21 మంది గాయపడ్డారు.

అమెరికాలో కాల్పుల కలకలం

By

Published : Sep 1, 2019, 8:21 AM IST

Updated : Sep 29, 2019, 1:07 AM IST

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. టెక్సాస్ రాష్ట్రంలోని ఒడెస్సా పట్టణ సమీపంలోని మిడ్​లాండ్​ ప్రాంతంలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు అధికారులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుడిని మట్టుబెట్టారు. ప్రస్తుతానికి సాయుధులైన ముష్కరులు ఎవరూ మిడ్​లాండ్​లో లేరని తెలిపారు.

టొయోటా వాహనంలో వచ్చిన దుండగుడు తొలుత యూఎస్​ పోస్టల్​ సర్వీస్​ వ్యాన్​ని దొంగిలించాడు. అనంతరం అదే వ్యాన్​లో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 3 గంటల సమయంలో పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. మొదటగా ఇద్దరు దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానించారు. అయితే ఒక వ్యక్తి ఫైరింగ్​ జరిపినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు.

ట్రంప్​ స్పందన

ఈ ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విషాదం వ్యక్తం చేశారు. కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు తనకు అందిచాలని అధికారులను ఆదేశించారు. ఎఫ్​బీఐతో పాటు ఇతర భద్రతాధికారులు ఈ ఫైరింగ్​పై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే టెక్సాస్​ గవర్నర్​ గ్రెగ్​ అబోట్​ ఈ ఘాతుకాన్ని ముర్ఖపు చర్యగా అభివర్ణించారు.

Last Updated : Sep 29, 2019, 1:07 AM IST

ABOUT THE AUTHOR

...view details