తెలంగాణ

telangana

By

Published : Nov 7, 2020, 2:36 PM IST

ETV Bharat / international

కరోనాపై పోరుకు బైడెన్-హారిస్​ కసరత్తులు

అధికారంలోకి వచ్చాక కరోనా, ఆర్థిక సంక్షోభంపై పోరాటానికి కావాల్సిన వ్యూహాలను బైడెన్-హారిస్ సిద్ధం చేస్తున్నారు. కరోనాతో కుదేలైన ఈ రంగాలను తిరిగి గాడిలో పెట్టేందుకు కావాల్సిన అస్త్రాలను సిద్ధం చేసుకుంటారని తెలుస్తోంది.

US-BIDEN-HARRIS
బైడెన్-హారిస్

ఎన్నికల్లో విజయంపై ధీమాతో డెమొక్రటిక్ అభ్యర్థులు జో బైడెన్, కమలా హారిస్​.. తమ పరిపాలన వ్యూహాలకు పదును పెట్టారు. కరోనాతో తీవ్ర సంక్షోభంలోకి చేరిన ప్రజారోగ్యం, ఆర్థిక వ్యవస్థ రంగాలపై దృష్టి సారించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి బైడెన్ కీలక ప్రకటన చేశారు.

బాధ్యతలు స్వీకరించిన మరు క్షణం నుంచి కరోనా నియంత్రణకు కృషి చేస్తామని బైడెన్​ స్పష్టం చేశారు. ఇప్పటివరకు బలైనవారిని రక్షించలేకపోయినా.. భవిష్యత్తులో చాలామంది ప్రాణాలు కాపాడుతామని హామీ ఇచ్చారు.

ఇప్పటికే ప్రజారోగ్యం, ఆర్థిక సంక్షోభం విషయంలో నిపుణుల బృందంతో బైడెన్, హారిస్ చర్చలు నిర్వహించారు. దేశంలో కరోనా నియంత్రణ ఎలా విఫలమైందో చర్చించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:'విజయం మాదే.. 300 ఎలక్టోరల్​లు గెలుస్తాం'

ABOUT THE AUTHOR

...view details